Tv Serial : ఈ మధ్య సినిమాలతో పోలిస్తే సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. విజువల్ ఎఫెక్ట్స్ తో పాటుగా ఎన్నో రకాలుగా స్టోరీలతో ట్విస్టులు ఇస్తున్నాయి సీరియల్స్.. కొన్ని సీరియల్స్ ఏకంగా జనాలను అంతగా ఆకట్టుకుంటున్నాయో.. జనాలతో విమర్శలు అందుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగు ఛానల్ జీ తెలుగులో వచ్చే సీరియల్స్ అన్నీ కూడా కాస్త గ్రాఫిక్స్ తో కూడుకున్నవి. కొన్ని సీరియల్స్ జనాలను చిరాకు తెప్పించే విధంగా సీన్లు ఉంటున్నాయి. అందులో ఇప్పుడు ఒక సీరియల్ కు సంబంధించిన విజువల్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ సీరియల్ మరేంటో కాదు చామంతి.. ఈ సీరియల్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. తాజాగా ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ప్రోమో ని మేకర్స్ రిలీజ్ చేశారు.. ఆ సీరియల్ ప్రోమో లోని సీన్స్ పై నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. దాంతో పాటుగా కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
ప్రముఖ తెలుగు ఛానల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్ జనాలని ఎంతగా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మిగతా సీరియల్స్ తో పోలిస్తే ఇక్కడ ప్రసారమవుతున్న సీరియల్స్లలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంటాయన్న సంగతి తెలిసిందే.. ఒక సీరియల్ మించి మరొక సీరియల్ స్టోరీ ఉండడంతో జనాలు వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు.. తాజాగా జీ తెలుగులో ప్రసారమవుతున్న చామంతి సీరియల్ కి సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఆ ప్రోమోలో.. సీరియల్ హీరోయిన్ మేఘన లోకేష్ దెయ్యం పట్టిన దానిలాగా ప్రవర్తిస్తుంది.. అందులో మొదటగా హారము ఎక్కడికి వెళ్లిందని వెతుకుతూ కనిపిస్తుంది ఒక అమ్మాయి. తర్వాత గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ తో హీరోయిన్ మేఘన ఎంట్రీ ఇస్తుంది. అయితే ఎవరూ అని అడిగితే ఎవరా నేనెవరో నీకు తెలియదా అని గట్టిగా అరుస్తుంది. నేనెవరో అచ్యుతాపురం మహారాణి అని అంటుంది. అచ్చం దెయ్యంలాగే ఉన్న ఆ సీన్ జనాలని కాస్త నవ్వించేసింది… ఆ సీన్ కోసం మేకర్స్ బాగానే గ్రాఫిక్స్ ని వాడారని సోషల్ మీడియాలో ట్రోల్స్ వినిపిస్తున్నాయి.. ఆ వీడియోని చూసిన పలువురు నెటిజెన్లు జనాలని పిచ్చోలని చేస్తున్నారు కదరా అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. దానికి ప్రోమో అయితే నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది..
Also Read :తండ్రిని గుర్తుచేసుకున్న మహా.. మహా తిండిని చూసి చక్రీ.. గాయత్రికి తాయారు వార్నింగ్..
ఈమధ్య మిగిలిన చానల్లో ప్రసారమవుతున్న సీరియల్స్ తో పోలిస్తే.. జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియస్లలో ఇలాంటి సీన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. కొన్నిసార్లు జనాలు వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. మరికొన్నిసార్లు ఎందుకురా ఇంత పెద్ద సీన్ ని క్రియేట్ చేశారు అని జనాలు అభిప్రాయపడుతున్నారని తెలుస్తుంది.. సినిమాలను మించిన స్టోరీ ఉందని కొందరు అంటున్నారు.. గతంలో ఇలాంటి టోల్స్ జీ తెలుగులో ప్రసారమవుతున్న పలు సీరియల్స్ కి వచ్చాయి.. ఇప్పుడు చామంతి సీరియల్ కూడా గ్రాఫిక్స్ ని విపరీతంగా వాడేసారంటూ నెటిజెన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. మొత్తానికైతే ఇది హాట్ టాపిక్ గా మారింది.. మరి ఈ ట్రోల్స్ పై సీరియల్ మేకర్స్ స్పందిస్తారేమో చూడాలి..