Nindu Noorella Saavasam Serial Today Episode: యాదమ్మ, బుజ్జమ్మ దగ్గరకు వెళ్లి మీ నాన్న ఎవరో నీకు తెలుసుకోవాలని ఉందా..? అని అడగ్గానే.. ఉంది అని చెప్తుంది బుజ్జమ్మ. దీంతో యాదమ్మ మీ నాన్న ఎవరో నేను చెప్పనా… అనగానే.. మా నాన్న ఎవరో నీకు తెలుసా..? అని బుజ్జమ్మ అడగ్గానే.. ఆ తెలుసు అంటుంది యాదమ్మ. అయితే చెప్పు ఎవరు మా నాన్న అని బుజ్జమ్మ అడగ్గానే.. యాదమ్మ అటూ ఇటూ చూసి అమరేంద్ర సారే మీ నాన్న అని చెప్పగానే.. బుజ్జమ్మ తెలుసు అంటుంది. దీంతో యాదమ్మ షాక్ అవుతుంది. తెలుసా..? ఎవరు చెప్పారు అని అడగ్గానే.. బుజ్జమ్మ మా అమ్మ చెప్పింది అంటుంది. ఏంటి మీ అమ్మ చెప్పిందా..? అని అడగ్గానే.. అవును మా అమరేంద్ర సార్ను మా నాన్నఅనుకోమని మా అమ్మ చెప్పింది అనగానే..
యాదమ్మ ఇరిటేటింగ్ గా అనుకోవడం కాదు నిజంగా సారే మీ నాన్న అని చెప్పగానే.. బుజ్జమ్మ నిజంగా సారే మా నాన్న అనుకోమని కూడా మా అమ్మ చెప్పింది అనగానే.. యాదమ్మ కోపంగా సీరియస్గా సారే మీ నాన్న బుజ్జమ్మ అనగానే.. బుజ్జమ్మ కూడా సీరియస్గా సారే మా నాన్న అనుకోమని అమ్మ చెప్పింది అనగానే.. యాదమ్మ ఇరిటేటింగ్ గా నీకు ఎలా చెప్పాలే తల్లి ఆయనే మీ నాన్న అనుకోవడం కాదు బుజ్జమ్మ.. నిజంగా ఆయనే సీరియస్గా మీ నాన్న, నిన్ను కన్న తండ్రి అనగానే.. చెప్పిందే ఇన్ని సార్లు ఎందుకు చెప్తావు యాదమ్మ. సార్ నే మా నాన్న అనుకోమని మా అమ్మ చెప్పింది అనగానే.. యాదమ్మ సరేలే అలాగేలేమ్మా.. వెళ్లు.. అనగానే.. బుజ్జమ్మ మాత్రం నాన్న గురించి అమ్మ ఎందుకు దాచిందో నాకు తెలియదు. అమ్మ చెప్పే వరకు నాన్న ఎవరో నాకు తెలిసిన విషయం నేను ఎవ్వరికీ చెప్పకూడదు అని మనసులో అనుకుంటూ వెళ్లిపోతుంది బుజ్జమ్మ.
ఇంతలో అక్కడికి మనోహరి వచ్చి ఏంటి చంభా ఆ పిల్లకు ఫోటో చూడమని చెప్పావా..? అని అడగ్గానే.. యాదమ్మ మాత్రం కాదు డైరెక్టుగా నిజమే చెప్పేశాను అనగానే.. ఏంటి అమర్ తన ఫాథర్ అని బుజ్జమ్మకు చెప్పేశావా..? అసలు బుద్దుందా నీకు అలా డైరెక్టుగా చెబితే భాగీతో ప్రాబ్లమ్ అని చెప్పాను కదా..? ఒక్కపని కూడా సరిగ్గా చేయవు.. అనగానే.. అంత టెన్షన్ అవ్వకు నేను చెప్పింది బుజ్జమ్మ నమ్మలేదు. అమరేంద్ర సార్ను వాళ్ల నాన్న అనుకోమని బుజ్జమ్మకు భాగీ చెప్పిందంట. ఆ పిల్ల చిలకలాగా చెప్పిందే చెప్తుంది. అదే చెప్తుంది అనగానే.. మనోహరి అనుమానంగా అమర్ తన ఫాథర్ అనుకోవడం అని చెప్పడం ఏంటి..? అమరే తన నిజమైన ఫాథర్ అని చెప్పలేదా నువ్వు అని అడగ్గానే.. మూడు సార్లు చెప్పాను.. ఆ పిల్ల నమ్మలేదు.. అంటూ చంబా చెప్పగానే.. నువ్వు సరిగ్గా కన్వీన్స్ చేయలేదేమో అంటూ మనోహరి చెప్పగానే..
నువ్వు కన్వీన్స్ చేయలేదు. సరిగ్గా చెప్పలేదు.. ఈ మాటలు వద్దు మనోహరి. రణవీర్ వచ్చి అమరేద్ర దృష్టి మరల్చడానికి అమరేద్రకు భాగీకి మధ్య గొడవలు పెట్టాలని నువ్వు వేసిన ప్లాన్లు అన్ని వేస్ట్ ఇవన్నీ వర్కవుట్ అవ్వవు.. అనగానే.. మనోహరి కోపంగా నువ్వు కాస్త తెలివిగా ఉంటే వర్కవుట్ అయ్యేవి అనగానే.. యాదమ్మ కోపంగా ఏంటి తెలివిగా ఉండేది. నాకంటే నీకంటే ఆ భాగీ చాలా తెలివైంది. భాగీ కంటే దాని కూతురు ఇంకా తెలివైన దానిలా ఉంది. వాళ్ల ముందు నీ ఆటలు సాగవు. ఏదైనా ఉంటే డైరెక్టుగా అమరేంద్రతోనే తేల్చుకో అదే నీకు మంచిది. ఇదంతా కాదు మనోహరి నీ సమస్యకు అడ్డదారుల్లో పరిష్కారం రాదు. రహదారుల్లోనే వెళ్లు అర్థమైందా..? అనగానే.. ఓకే నువ్వు చెప్పినట్టు అమరేంద్ర తోనే తేల్చుకుంటాను అంటుంది మనోహరి.
మరోవైపు రణవీర్ను ఒక రూంలో బంధించిన అమర్ ఒక సైకియాట్రిస్ట్ ద్వారా రణవీర్ చేత నిజం చెప్పించాలని చూస్తాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.