Podarillu Today Episode April 23rd : ముహూర్తం వచ్చే నెల పెట్టగానే అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అందరూ ఇక వెళ్ళిపోగానే మాధవ్ కన్నా చాలా సంతోషంగా ఉన్నాడు నాకు అదే చాలు అని అంటాడు. వాడికి వదిన స్థానంలో అమ్మ వస్తుంది కదా అందుకే చాలా సంతోషంగా ఉంటాడు అని మాధవ్ అంటాడు. ఇక మహాలక్ష్మి కన్నా నీ ఎమోషనల్ అవ్వకుండా చూసుకుంటుంది. పెళ్లి పనులను అన్నిటిని నేనే దగ్గరను చూసుకుంటానని చక్రి మాట ఇస్తాడు.. కేశవ చక్రి ఇద్దరు కూడా మరోసారి గొడవపడతారు అది చూసిన మహాలక్ష్మి సీరియస్ అవుతుంది… కొంచెం కూడా బుద్ధి లేదా ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు అని మహాలక్ష్మి వాళ్ళని తిడుతుంది.
ఏంట్రా పొద్దున లేచినప్పటి నుంచి గొడవ పడుతూనే ఉంటారు అని.. మాధవ్ ఎంత సద్ది చెప్పాలని చూసినా సరే చక్రి కేశవ మాత్రం కొట్టుకోవడం ఆపరు.. మహాలక్ష్మి రాతిరి తిట్టింది కదా మళ్ళీ ఇప్పుడు గొడవ పడుతున్నారు ఏంటి అని మాధవ్ ఎంత చెప్తున్నా సరే.. ఆ ఇద్దరు మాత్రం కొట్టుకోవడం మాత్రం ఆపరు.. ఇద్దరు కొట్టుకోవడం చూసిన మాధవ్ ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అనుకుంటాడు. అప్పుడే మహాలక్ష్మి రావడంతో వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంతేకాదు వాళ్ళు ఇద్దరు కూడా గొడవను ఆపేసి మౌనంగా ఉండిపోతారు. ఇంకొకసారి మీ ఇద్దరు గొడవపడితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని మహాలక్ష్మి వార్నింగ్ ఇస్తుంది.
మీరు మమ్మల్ని తిట్టడం ఆపేస్తే మేము వెళ్ళిపోతాము అని కేశవ కన్నా ఇద్దరు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన నారాయణ ఇవాళ టిఫిన్ ఏంట్రా అని అడుగుతాడు. ఒక్క పూట టిఫిన్ చేయకపోతే ఏం చచ్చిపోలేని కేశవ అంటాడు. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళగానే కన్నా బాగా బాధపడిపోతూ ఉంటాడు. నువ్వేంట్రా ఆ అంటే కన్నీళ్లు పెట్టుకుంటావు. ఏం జరిగింది అని మహాలక్ష్మి అడుగుతుంది. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటున్నావు కదా వదినా అందుకే నాకు బాధగా ఉంది.. నిజంగానే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతావా అని కన్న అడుగుతాడు.. నేను ఎక్కడికి వెళ్ళను నువ్వేం బాధపడకు అని మహాలక్ష్మి అంటుంది.
మాధవ్ నీ కలవడానికి కవిత చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. మాధవ్ సైట్ లో ఉండగా ఫోన్ చేసి రమ్మని పిలుస్తుంది. సాయంత్రం అవ్వగానే వస్తానని మాధవ్ చెప్తాడు.. ఇక కవిత రెస్టారెంట్లు వెయిట్ చేస్తుండగా మాధవ్ అక్కడికి వెళ్తాడు. తానే ఎంతగా చెబుతున్న సరే మాధవ్ మాత్రం దేని గురించి మాట్లాడుతుందో అర్థం కావడం లేదు అని అనుకుంటాడు. అయితే మనము ఇల్లు ఎక్కడ తీసుకోవాలి అని ఆమె అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మాధవ్. ఆ ఇల్లు ఉంది కదా మరి మనం ఎందుకు తీసుకోవాలి అని అనగానే మీకు ఈ విషయం తెలియదా ఏంటి అని కవిత మాధవ్ కి అసలు నిజాన్ని చెప్పేస్తుంది.. ఆ మాట వినగానే మాధవ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వచ్చేస్తాడు. తమ్ములందరికీ నిజం తెలిసిన సరే నా దగ్గర దాచి నా సంతోషాన్ని కోరుకున్నారు అని మాధవ్ బాధపడతాడు..
చాలా బాధపడిపోదు ఇంటికి వస్తాడు. లోపల వాళ్ల తమ్ముళ్లు పెళ్లికి కావలసిన సామాన్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చక్రి రాసిన సామాన్లు అనేవి చదవమని కేశవ అడుగుతాడు తన తెలుగుకి అందరూ నవ్వుతారు.. అప్పుడే సడన్గా ఇంట్లోకి మాధవ్ ఇంట్లో ఇస్తాడు. కానీ నాకు తెలియదు తను చూసినా మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. లోపలికి వెళ్ళిన మాధవ్ తన బట్టల్ని సర్దుకుని బయటికి వస్తాడు.. ఇంట్లోంచి ఎందుకు వెళ్లాలి అని అనుకున్నారు అని అడుగుతారు ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. నేను మీకు అక్కర్లేదా ఎందుకు నన్ను వదిలేయాలి అని అనుకున్నారని మాధవ్ బాధపడేలా మాట్లాడుతాడు.. నీ సంతోషమే మాకు ముఖ్యం అన్నయ్య అని అందరూ ఎంత చెబుతున్నా సరే మాధవ్ మాత్రం బాధపడతాడు.
మా కోసం కొవ్వొత్తి లాగా మీరు కరిగిపోతూనే ఉన్నారు.. ఏం కావాలన్నా కూడా ఇప్పుడు మేము చూసుకుంటాము. మమ్మల్ని సొంత బిడ్డల్లాగా చూసుకున్నావు.. కానీ నా తమ్ముళ్ళని వదిలి నేను ఎక్కడికి రా పోను అని మాధవ్ అంటాడు. అప్పుడే కవిత ఫోన్ చేయగానే తన ఫోన్ లిఫ్ట్ చేసిన మాధవ్ నా తమ్ములను వదిలి నేను ఎక్కడికి రాను ఈ పెళ్లి గురించి మర్చిపోండి అని ఒక్క మాటతో సమాధానం చెప్తాడు. నాకు తెలియకుండా ఏ పని చేయడానికి వీలు లేదు అని మాధవ్ తమ్ముళ్ళకి కండిషన్ పెడతాడు.. మాధవ్ మాత్రం మహాలక్ష్మికి తన బాధ గురించి వివరించి బాధపడతాడు. అలాగే మా అన్నదమ్ముల మధ్య కూడా అదే బంధం కలిపి ఉంచుతుంది. వీళ్ళ బంధం చాలా గొప్పది అని మహాలక్ష్మి అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..