Ireland vs Pakistan: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (2026 T20 World Cup tournament) విజేతగా నిలిచిన టీమ్ ఇండియాను (Team India) మట్టి కల్పించిన ఐర్లాండ్, మరో పోరుకు సిద్ధమవుతోంది. ఇక ఇప్పుడు పాకిస్తాన్ లో అడుగుపెట్టి ఆ జట్టును కూడా, పాతాళానికి తొక్కెందుకు రెడీ అవుతోంది ఐర్లాండ్. ఇందులో భాగంగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) అదిరిపోయే ప్లాన్ చేసింది. జింబాబ్వే, ఐర్లాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య ట్రై సిరీస్ నిర్వహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే ఈ ట్రై సిరీస్ 2027 లో జనవరిలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వన్డేనా ? లేదా టి20నా ఏ ఫార్మాట్ అనేది ఇంకా క్లారిటీ రాలేదు. 2027 వన్డే వరల్డ్ కప్ ఉన్న తరుణంలో వన్డే పార్మాట్ లోనే జరిగే అవకాశాలు ఉండనున్నాయి. దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టీమిండియాపై అద్భుతంగా రాణించి ఇటీవల టి20 సిరీస్ కైవసం చేసుకుంది ఐర్లాండ్. ఈ రెండు జట్ల మధ్య రెండు టీ20 లు జరగగా, టీమిండియాను వైట్ వాష్ చేసింది ఐర్లాండ్. 5 గురు స్టార్ క్రికెటర్లు గాయాల బారీన పడినా, వరల్డ్ నెంబర్ 1 జట్టు టీమిండియాను మట్టి కరిపించింది ఐర్లాండ్. ఇక ఈ ఊపుతో ట్రై సిరీస్ లో పాల్గొనేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్, ఐర్లాండ్ అలాగే జింబాబ్వే మధ్య ఈ ట్రై సిరీస్ 2027 జనవరిలో ఉంటుంది. ఈ ట్రై సిరీస్ కోసం లాహోర్ లోని గడాఫీ, రావల్పిండి క్రికెట్ స్టేడియం, కరాచీలోని నేషనల్ బ్యాంక్ స్టేడియాలను సిద్ధం చేయబోతున్నారట. ఇందులో ఎలాగైనా గెలిచి, ముందుకు వెళ్లాలని ఐర్లాండ్ ప్లాన్ చేస్తోంది. అటు సొంత గడ్డపై జరిగే ఈ టోర్నమెంట్ లో గెలిచా సత్తా చాటేందుకు పాక్ కసరత్తులు మొదలు పెట్టింది. టీమిండియా తరహాలో ఓడిపోకుండా, రివర్స్ ఎటాక్ చేసేందుకు పాక్ రెడీ అవుతోంది.
తమ సొంత గడ్డపై వరుసగా ట్రై సిరీస్ లు నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే 2026 అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో పాకిస్తాన్, ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య వన్డే ట్రై సిరీస్ జరిపేలా PCB నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బడ్జెట్ కు కూడా ఆమోదం తెలిపింది. ఈ టోర్నమెంట్ పూర్తికాగానే 2027 జనవరిలో జింబాబ్వే, ఐర్లాండ్ అలాగే పాకిస్తాన్ చెట్ల మధ్య ట్రై సిరీస్ షురూ అవుతుంది. అనంతరం 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ పై పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఫోకస్ చేయనుంది.