Intinti Ramayanam Avani : స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. ఇంటింటి రామాయణం అంటూ మొదలైన ఈ సీరియల్ స్టోరీ నిజంగానే టైటిల్ కు తగ్గట్లే అదిరిపోయేలా ఉంటుంది. ప్రతి ఇంట్లో జరిగే పంచాయితీలు గొడవలు ఈ సీరియల్ లో కనిపిస్తాయి. ఒకరు ఎదుగుతుంటే ఓర్వలేని కుటుంబ సభ్యులు ఆ కుటుంబాన్ని ఎలా ముక్కలు చేయాలని ఆలోచిస్తారు అన్నది ఈ సీరియల్ లో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. కుటుంబాన్ని మొక్కలు చేయాలని చూస్తున్నా చిన్నకోడలి ప్రయత్నాలని పెద్ద కోడలు విఫలమయ్యేలా చేస్తుంది.. ఈ పెద్ద కోడలు అవని పాత్రలో ఈ సీరియల్ లో నటించిన నటి అసలు పేరు పల్లవి రామిశెట్టి.. ఈమె గురించి ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త షికారు చేస్తుంది. ఇంతకీ అవని ఏం చదువుకుంది? సీరియల్ లోకి ఎలా వచ్చిందో ఇప్పుడు ఒకసారి ఈ వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెర సీరియల్ హీరోయిన్ అవని అలియాస్ పల్లవి రామిశెట్టి గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. ఈమె ఒకప్పుడు వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉండేది. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న పల్లవి ఇప్పుడు మళ్ళీ వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది.. ఈమె రియల్ లైఫ్ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా అవనిగడ్డలో పల్లవి జన్మించింది.. తండ్రి ఉద్యోగరీత్యా బెంగళూరుకి వెళ్లారు.. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్ కి తిరిగి వచ్చారు.. అయితే ఈమె పదవ తరగతి చదువుతున్నప్పుడు సీరియల్ ఆడిషన్స్ కి వెళ్ళింది. ఆ తర్వాత ఆడిషన్స్ లో సెలెక్ట్ అవ్వడంతో చదువుకి గుడ్ బై చెప్పేసింది.. యాంకర్ గా కెరియర్ ని ప్రారంభించిన పల్లవి ఆ తర్వాత సీరియల్స్లలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఇంటింటి రామాయణం సీరియల్ లో నటిస్తుంది..
తెలుగు సీరియల్ హీరోయిన్ పల్లవి రామిశెట్టి.. ఈటివిలో వచ్చిన రంగుల కళ కార్యక్రమంకి వ్యాఖ్యాతగా ఎంపికైంది.. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమైన సీరియల్స్లలో నటించే అవకాశాన్ని అందుకుంది. భార్యామణి సీరియల్ లో అలేఖ్య పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆడదే ఆధారం సీరియల్ లో నటించి మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంది. దీని తర్వాత వచ్చిన వసుంధర, మాటే మంత్రం, అత్తారింటికి దారేది సీరియల్ కూడా ఆమెకు మంచి పాపులారిటీని అందించింది.. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ప్రస్తుతం ఇంటింటి రామాయణం సీరియల్ తో పాటుగా ఈటీవీలో ప్రసారమవుతున్న జానకి పరిణయం సీరియల్ లో కూడా హీరోయిన్గా నటిస్తూ బిజీగా ఉంది.. సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఈమె రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే తీసుకుంటుంది..