Podarillu Today Episode April 14th : నారాయణ గాయత్రి కి పెళ్లి సంబంధం కోసం వచ్చిన వాళ్ళని శాఖ ఎలా చేస్తాడు. ఆ తాయారు కూతురుతో సంబంధం కలుపుకోవడానికి వచ్చారా వాళ్ల గురించి ఈ ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు.. దుబాయ్ లో వాడు ఇంకొక దాన్ని ఉంచుకొని దానికి మొత్తం తగలేశాడు మీకు ఆ విషయం తెలియదా అని ఆ సంబంధం చెడగొట్టేలా మాట్లాడుతాడు. మాధవ్ వచ్చి ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారు ఒక ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించరా అని అడుగుతాడు.. మాధవ్ గాయత్రి గురించి చాలా గొప్పగా చెప్తాడు. పెళ్లి వాళ్ళు గాయత్రి లాంటి అమ్మాయి మా ఇంటి కోడలు కూడా మా సంతోషమని మా అదృష్టం అంటూ సంతోషంగా ఉంటారు..
మాధవ్ గాయత్రి సంబంధాన్ని చెడగొట్టకుండా చేశాడు అని నారాయణ చాలా కోపంగా ఇంటికి వస్తాడు. వీడు మంచి వీడిని చెడగొట్టేలా చేస్తుంది నా కడుపుని చెడగొట్టాడు అని కోపంగా నారాయణ తిడుతూ ఉండగా మహాలక్ష్మి ఏం జరిగింది అని అడుగుతుంది. అయితే మహాలక్ష్మి పెళ్లి చేసిన దాంట్లో ఇప్పుడు తప్ప ఏమీ లేదు కదా అని మహాలక్ష్మి అంటుంది.. ఆయన చేసిన పని వల్ల పెద్దికి ఇబ్బంది కలిగేది కానీ పెద్ది చేసినందు వల్ల నాకు ఆయన మీద గౌరవం పెరిగింది. పెద్ది అంటే ఇప్పుడు ఇంకాస్త ఇష్టం కూడా పెరిగింది అని మహాలక్ష్మి అంటుంది.
చక్రి మాధవ్ ని బయటికి తీసుకుని వెళ్లాలని అలా తీసుకొని వెళ్తాడు. అయితే గాయత్రి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లగానే చక్రి మాధవ్ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటారు. చక్రి మాధవ్ ని ఎంతగా నవ్వించడానికి ప్రయత్నాలు చేసినా సరే మాధవ్ మాత్రం మొదట సీరియస్ గా ఉంటాడు. అయితే చక్రి ఈ వేసిన కుళ్ళు జోకులతో మాధవ్ నవ్వుతాడు. అయితే గాయత్రి వాళ్ళు అక్కడ వాళ్ళ ఇంటికి డెకరేట్ చేయడం చూసినా మాధవ్ ఏందో జరుగుతుంది అని అనుకుంటారు. వాళ్లది ఏదో ఫంక్షన్ లాగా ఉంది అని చక్రి మాధవ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు.. పైన ఉన్న గాయత్రీ ని చూసి మాధవ్ ఎమోషనల్ అవుతాడు. వీరిద్దరి మధ్య ఒక ఎమోషనల్ సాంగ్ రన్ అవుతుంది ఎపిసోడ్ కి అదే హైలెట్గా నిలుస్తుంది..
మాధవ్ వంటగదిలో ఏదో మాడిపోతున్న సరే పట్టించుకోకుండా పరధ్యానంలో ఉండడంతో మహాలక్ష్మి ఏదో మాడిపోతుంది అని అక్కడికి వస్తుంది. అక్కడ కూర మాడిపోతుందని చెప్పగానే మాధవ్ వెంటనే అయ్యో నేను చూసుకోలేదు అమ్మా అని అంటాడు.. గదిలో ఉన్న నాకు మాడిపోతున్న వాసన రావడంతో పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ ఇక్కడే ఉన్నా మీరు పట్టించుకోకపోవడం ఏంటి అని అడుగుతుంది. అక్కడ ఏమి జరగలేదమ్మా నేను ఇది వలిచిన తర్వాత చూద్దామని అనుకున్నాను అంతలోకే మాడిపోయిందని మాధవ్ ఏదో ఒకటి కవర్ చేస్తాడు.. ఇక మాధవ్ మా గాయత్రీ ని మర్చిపోలేక ఆలోచిస్తున్నాడని మహాలక్ష్మి అనుకుంటుంది.
మహాలక్ష్మి అందరూ భోజనాలు వడ్డించుకున్న తర్వాత తింటూ ఉండగా.. కన్నా ఉప్పులో కూర వేసావా లేదా కూరలో ఉప్పు వేస్తావా అని మాధవ్ అని అరుస్తాడు.. ఇంత చండాలంగా ఉంది ఏంటి అన్నయ్య అని అంటాడు.. ఆ మాట వినగానే మహాలక్ష్మి కోప్పడుతుంది.. ఒక్కరోజు కూరలో ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా ఏం పర్లేదు సర్దుకోవచ్చు ముందు తిను అని కోపంగా చూస్తుంది. ఇక అందరూ కూడా తనని కోపంగా చూడడంతో మాధవ్ చేసిన వంటకి వంకలు పెట్టుకున్నా అందరూ తింటారు. పాలని కింద పోసేస్తాడు. మహాలక్ష్మి మాత్రం మాధవిని చూసి బాధపడుతుంది.
వంట గదిలో పాలని క్లీన్ చేయడానికి కన్నా మహాలక్ష్మి ఇద్దరు కూడా చాలా కష్టపడతారు. కానీ మాధవ్ బాధను చూసిన నారాయణ ఈ మందు తాగితే నీ బాధను మర్చిపోతావు అని అతనికి బలవంతంగా మందు తాపిస్తాడు.. అయితే మహాలక్ష్మి బాధను మర్చిపోవడానికి మీ నాన్నతో కలిసి మా పెద్ది కూడా మందు తాగుతున్నాడేమో అని అంటుంది. చచ్చినా కూడా పెద్దన్నయ్య అలాంటి పని చేయడు అని కన్నా అంటాడు కానీ బయటికి వెళ్లి చూడగానే మాధవ్ మందు తాగుతూ కనిపిస్తాడు. అది చూసినా మహాలక్ష్మి షాక్ అవుతుంది.. పెద్ది మీరు కూడా ఇలా తయారవుతారు నేను అసలు ఊహించలేదు అని అరుస్తుంది. అంతే కాదు నారాయణ అని కూడా అరవడంతో భయపడతాడు.
మందు తాగిన మాధవ్ ని తన తమ్ముళ్లు ముగ్గురు కూడా కంట్రోల్ చేయలేక పోతారు. కానీ తన బాధ ఇది అని మాధవ్ చెప్పడంతో అందరూ కూడా తన బాధని అర్థం చేసుకుని ఎమోషనల్ అయిపోతారు.. ఎపిసోడ్ కి ఇదే హైలెట్ గా మారుతుంది.. ఇకపోతే మాధవ్ బాధని చూస్తున్న మహాలక్ష్మి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది.. చక్రి మాత్రం మా అన్నయ్యని ఇలా చూడడం ఇదే మొదటిసారి కానీ తన బాధను మర్చిపోయాడు నాకు చాలా సంతోషంగా ఉంది అని మహాతో అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…