Podarillu Today Episode March 5th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం బయటికి వచ్చిన మహా నారాయణ కత్తి నూరుతూ ఉండడం చూసి భయపడి పోతుంది.. కంగారుపడుతూ లోపలికి వెళ్లడం చూసిన మాధవ్ బయటికి వెళ్లి నారాయణను అడుగుతాడు.. కోసం కత్తి నూరుతున్నాను రా అని అనగానే మహా ఇందుకే భయపడి పోయిందేమో అని అనుకుంటాడు.. అయితే లోపలికి వెళ్లిన మాధవ్ మహా తో మాట్లాడుతూ ఉంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి కొబ్బరి బొండాలను తెంచుతూ ఉంటాడు.. చూసిన నారాయణ రెచ్చిపోతాడు.. ఆయన ప్రవర్తన చూసి మహా భయపడిపోతుంది.. ఈ ఇంట్లో ఉండకూడదు అని ఫిక్స్ అయ్యి బయటకు వెళ్లిపోవాలని అనుకుంటుంది.. తర్వాత మహా ఒక ఇంటిని చూసుకుంటుంది.. మహా మీరిద్దరూ ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు నేను తర్వాత వచ్చి మాట్లాడిన అని అంటుంది. మా ఇద్దరి మధ్య అంత చెప్పుకోదగ్గ సీక్రెట్స్ అయితే లేవు. ఏంటో చెప్పమ్మా అని మాధవ్ అంటాడు.. ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. కానీ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్లి మహాలక్ష్మి ఇల్లు ఇవ్వకూడదు అని చెప్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. గదిని అద్దెకిచ్చే వ్యక్తి దగ్గరికి వెళ్లి అతన్ని బెదిరిస్తాడు చక్రీ . ఇల్లు అద్దగిస్తే మర్యాదగా ఉండదు అని అంటాడు.. అతను సరే అండి అలాగే అని అంటాడు.. ఆ తర్వాత మహా దగ్గరికి వెళ్లిన చక్రి ఎంతగా అడిగినా సరే మహా మాత్రం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అని అంటుంది. అన్న వెళ్లిపోయిన తర్వాత వెళ్ళిపోతాను అని అనగానే మహా మాధవ్ ఫీల్ అవుతాడు. ఇక తర్వాత ఎగ్జామ్ రాయడానికి కన్నా రెడీ అవుతూ ఉంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చినా మహాను చూసిన మాధవ్ నీకు కూడా రెండు దోసలు వేసి పెడతానమ్మా తిను అని అంటాడు. నాకు దోశలు ఏమీ వద్దు పెద్ది అని మహా అంటుంది.. కానీ మాధవ్ మాత్రం నా చేతి వంట ఇంకెప్పుడు తింటావో ఏంటో.. అని ఎంత చెప్తున్నా సరే మహా మాత్రం నాకు దోశలు వద్దు అని అంటుంది.
అప్పుడే అక్కడికి వచ్చిన కేశవ్ అని చూసి చక్రి ఏం జరుగుతుంది రా లోపల అని అడుగుతాడు. కానీ మహా మాత్రం కేశవ కి దోసెలిచ్చి నోట్లో నాలుకలేనోడు ఎలా బతుకుతాడో పాపం అని అంటుంది.. నోట్లో నాలుక ఉంది కదా ఎలా బతుకుతుందేంటి అని కేశవ అంటాడు.. ఇక తర్వాత మహాలక్ష్మి నేను వెళ్తాను పెద్ది అని చెప్పేసి తన బ్యాగులు తెచ్చుకుని వెళ్లాలని అనుకుంటుంది.. అయితే చక్రి బండి మీద వదిలిపెడతాడమ్మా అని మాధవ్ చెప్తాడు.. మాధవ్ చెప్పగానే చక్రి తన బండి మీద ఎక్కించుకొని వెళ్తాడు. పాటలు పాడుతూ ఉత్సాహంగా కనిపించడంతో చక్రి ఫై మహా సీరియస్ అవుతుంది.
ఇక ఒక చోట ఆపమని చెప్పి మహాలక్ష్మి రూమ్ దగ్గరికి నేను వెళ్తాను నేను వెళ్ళండి అని అంటుంది.. మహా అక్కడికి వెళ్ళగానే ఇంటి ఓనరు దిమ్మ తిరిగిలా షాక్ ఇస్తారు. మా ఆవిడ అమ్మాయిలకి రూమ్ ఇవ్వద్దని చెప్పింది. మా వాళ్ళకి ఇచ్చేశాను నువ్వు ఎవరు అసలు నిన్ను అడ్వాన్స్ ఇచ్చాను కదండీ అని మహా ఎంత చెప్తున్నా సరే అతను మాత్రం వినకుండా కసురుకుంటాడు. అయితే నేను ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు నీకు ఇచ్చేస్తాను ఇకనుంచి వెళ్ళిపో అని అంటాడు. చక్రీ మాత్రం ఫోన్ మాట్లాడుకుంటూ అక్కడే ఉండిపోతాడు. ఇతనికి నేను మళ్లీ వస్తానని తెలుసా? ఏంటి అని మొదట అనుమానించిన మహా ఆ తర్వాత తెలిసుండే ఛాన్స్ లేదులే అని అనుకుంటుంది..
నీకు అక్కడికి రాగానే చక్రి ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు ఏంటి మీరు ఇంకా వెళ్ళలేదు అని అంటుంది… అయితే ఫోన్ మాట్లాడుకుంటూ ఉండిపోయాను తప్పేంటి అని అంటాడు. రూమ్ ఇవ్వను అని చెప్పాడు అని మహా అంటుంది. ఇక మహా చక్రి ఇద్దరు కలిసి ఆ ఓనర్ దగ్గరికి వెళ్లి గొడవపడతారు.. అయితే అతను చక్రీ చెప్పినట్లు చెప్పేసేయ్ మహాకు దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తాడు.. ఇక మహా చక్రి బయటకు రాగానే చక్రి మీరు అబద్ధం చెప్పారు. అయితే మీరు చెప్పింది తప్పు కాదు నేను చెప్పింది తప్పు అని అంటాడు. చక్రిని మహా మహా ఒక ఆట ఆడుకుంటుంది. తనకి మళ్లీ చక్రితో పార్టీ వెళ్లడానికి మహా ఒప్పుకుంటుంది..
Also Read : రోహిణి పై బాలుకు అనుమానం.. అడ్డంగా దొరికిపోయిన మాణిక్యం.. రోహిణి బాగోతం బయటపడుతుందా..?
ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు. అప్పుడే కన్నా కేశవ ఇద్దరు ఇంటికి వస్తారు.. నా ఇంట్లోకి రాగానే వదినెక్కడ అని అడుగుతాడు. మాధవ్ వచ్చి రాతలకే వదినని ఎందుకు అడుగుతున్నావ్ రా అని అంటాడు. నీకెవరు చెప్పారు అంటే కేశవ చెప్పాడు అని అంటాడు. ఇక చక్రి మహా ఇద్దరు బ్యాగుతో వెళ్లారు అని చెప్పగానే మాధవ్ కన్నాకి ఎలా నిజం చెప్పాలి అర్థం కావట్లేదని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఎక్కడికి మహాచక్రి ఇద్దరూ వచ్చేస్తారు.. కన్నా ఎక్కడికి వెళ్లావు వదిన అని ఎంతగా అడుగుతున్నా సరే మహా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..