Jagadatri Deepthi : బుల్లితెర సీరియల్ హీరోయిన్ దీప్తి మన్నే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. బుల్లితెరపై ప్రసారమైన ఎన్నో సీరియల్స్ తో బాగా ఫేమస్ అయింది. దీప్తి గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక్కో సీరియల్ నాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రాధమ్మ కూతరు, జగధాత్రి సీరియల్స్ తో గుర్తింపు పొందిన నటి దీప్తి మన్నె.. ఈ మధ్యనే పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. తెలుగు కన్నడ సీరియస్లతో బాగా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చింది. అందులో భాగంగా తన భర్త గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. అంతే కాదు తన లవ్ స్టోరీ ఎలా మొదలైంది అన్న విషయాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఆమె తన భర్త గురించి ఏం చెప్పిందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..
కన్నడ సీరియల్స్ అలాగే తెలుగు సీరియల్స్లలో హీరోయిన్గా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే వైవాహిక బంధం లోకి అడుగు పెట్టింది. తాను ప్రేమించిన వ్యక్తితో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. తన పెళ్లికి సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూ కి పాల్గొంది. అందులో తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలను పంచుకుంది. అంతేకాదు తన ప్రేమ పెళ్లి ఎలా మొదలయ్యాయి అన్న విషయాలను కూడా అభిమానులతో పంచుకుంది.. నిజానికి ఆమె లవ్ స్టోరీ లో ఒక ట్విస్ట్ కూడా ఉంది.. మొదటిసారి ఆమెకు సోషల్ మీడియా ద్వారా ఒక అబ్బాయి కనెక్ట్ అయ్యాడట. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారట. ఇక ఇంట్లో చెప్పి కొద్ది రోజులు వెయిట్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నట్లు ఆమె చెప్పింది. లవ్ ఏమి లేదు. పెద్దలు ఒకే చెప్పారు ఒకేసారి జరిగిపోయాయి అని ఆమె చెప్పడంతో జనాలు షాక్ అవుతారు.. అయితే తన భర్త రాహుల్జాబ్ చేస్తున్నట్లు చెప్పింది.. ప్రస్తుతం తన అత్తగారింట్లో చాలా సంతోషంగా ఉన్నట్లు ఆమె ఆ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది..
Also Read :బుధవారం టీవీ సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..
దీప్తిమన్నై అంటే కన్నడ హీరోయిన్ అని అందరూ అనుకున్నారు. తాజాగా ఆమె పాల్గొన్న ఇంటర్వ్యూలో తెలుగమ్మాయి అని క్లారిటీ ఇచ్చింది. గోదావరి జిల్లాలోని వెస్ట్ గోదావరిలో ఆమె ఉన్నట్లు చెప్పింది. తండ్రి ఉద్యోగరీత్యా కర్ణాటక కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఆమె అంది. ఇంట్లో ఎప్పుడైనా గోదావరి గురించి మాట్లాడుకుంటూ ఉంటారని దీప్తి అంటున్నారు. తెలుగు బాగా మాట్లాడుతాను అప్పుడప్పుడు గోదావరి స్లాంగ్ కూడా అనుకోకుండా వచ్చేస్తుందని ఆమె తన నేటివ్ ప్లేస్ గురించి చాలా గొప్పగా చెప్పింది. తెలుగులో కాకుండా ముందుగా కన్నడ సీరియల్స్లలో అవకాశాలు రావడంతో కన్నడ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ జీ తెలుగులో ప్రసారమవుతున్న జగదాత్రి సీరియల్ లో నటిస్తుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈమె అందులో నటిస్తుంది. ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియస్లలో ఈ సీరియల్ మొదటి స్థానంలో ఉండడంతో ఆమె క్రేజ్ కూడా బాగా పెరిగింది. ఈ సీరియల్కు ఈమె దాదాపు 40 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం..