Shiva Jyothi:ప్రస్తుతం సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు శుభవార్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ యాంకర్ శివజ్యోతి దంపతులకు కూడా శుభవార్త తెలిపారు. తల్లిదండ్రులయ్యామంటూ ఈ మేరకు ఒక పోస్ట్ పంచుకున్నారు. ఫిబ్రవరి 12వ తేదీన పండంటి బిడ్డ పుట్టిందని అయితే ఆ విషయాన్ని ఆలస్యంగా చెప్పుకొచ్చారు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వారిలో తీన్మార్ వార్తలతో తన అద్భుతమైన వాక్చాతుర్యంతో తెలంగాణ యాస , భాష అద్భుతంగా మాట్లాడగలుగుతూ అందరిని ఆశ్చర్యపరిచి, భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న శివజ్యోతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలా యాంకర్ గా ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా భారీ పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు ఇన్స్టా రీల్స్ చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె తాజాగా అభిమానులతో శుభవార్త పంచుకుంది..
తన కడుపు పండిన రోజు నుంచి ఇటీవల డెలివరీ అయ్యే వరకు ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈమె ఫిబ్రవరి 12వ తేదీన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో యాంకర్ శివజ్యోతి , గంగూలీ పోస్ట్ పెట్టారు. అయితే ఈ జంటకు జన్మించింది అమ్మాయా? లేదా అబ్బాయా? అనే విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. తమకు పుట్టిన బిడ్డ జెండర్ ను త్వరలోనే రివీల్ చేస్తామని సోషల్ మీడియాలో శివజ్యోతి పోస్ట్ పెట్టింది. ఇకపోతే ఫిబ్రవరి 12వ తేదీన తమ ఇంటికి మూడవ వ్యక్తి వచ్చారని సోషల్ మీడియాలో ఎమోషనల్ అయింది శివజ్యోతి. ఇకపోతే ఈ దంపతులకు నెటిజన్స్ , అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. మొత్తానికైతే శివజ్యోతి , గంగూలీ ఎట్టకేలకు తల్లిదండ్రులయ్యారని చెప్పవచ్చు.
ALSO READ:Chiranjeevi: చిరంజీవి మెచ్చిన ఈ సీరియల్ నటి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
ఇదిలా ఉండగా శివజ్యోతి పెళ్లయిన చాలా ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆమె ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా సరోగసీ ద్వారా జన్మనివ్వబోతోంది అంటూ చాలామంది ఆమెపై విమర్శలు కూడా గుప్పించారు. అయితే దానిపై స్పందించిన శివజ్యోతి తాను సరోగసి ద్వారా బిడ్డకు జన్మనివ్వలేదు అని.. దేవుడు ఇచ్చిన వరమని.. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వ్రతం చేయడం వల్లే తన కడుపు పండింది అంటూ ఎమోషనల్ అయింది. తమ జీవితంలోకి మూడవ వ్యక్తి రాకను మరింత ఆనందంగా జరుపుకుంటున్నారు. కేక్ కట్ చేసి మరీ ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు శివజ్యోతి. ఇక ప్రస్తుతం శివ జ్యోతి గంగూలి తల్లిదండ్రులు కావడంతో అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేస్తూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సలహాలు ఇస్తున్నారు .