Intinti Ramayanam Avani : బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న సీరియల్స్లలో ఎంతో మంది హీరోయిన్లు నటిస్తున్నారు. ఈమధ్య తెలుగు వాళ్ళ కన్నా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ముద్దుగుమ్మలే ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్ లో టాప్ సీరియల్స్ లలో ఒకటి ఇంటింటి రామాయణం ఒకటి.. ఒక వ్యక్తి కుటుంబాన్ని నాశనం చేయడానికి ఎంతకైనా తెగిస్తుంది అని ఈ సీరియల్ స్టోరీ ని చూస్తే తెలుస్తుంది.. ఇందులో ప్రధాన పాత్రలో నటించింది అవని..ఈమె అసలు పేరు పల్లవి రామిశెట్టి.. ఈ అమ్మడు గతంలో ఎన్నో సీరియల్స్ లో నటించింది.. ఆమె నటించిన ప్రతి సీరియల్ కూడా మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న పల్లవి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు.. ఇందులో ఆమె భర్త గురించి తెలుసుకొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంతకీ ఆమె భర్త ఏం చేస్తున్నారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ లో మెయిన్ లీడ్ క్యారెక్టర్ లో నటించింది అవని.. ఈమె అసలు పేరు పల్లవి రామిశెట్టి.. ఈటీవీలో, జెమినీలో, స్టార్ మా లో పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను అలరించింది.. ఈమె చదివింది పదో తరగతి అయినా ఫాలోయింగ్ మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. సీరియల్స్ వారా బాగా ఫేమస్ అయిన పల్లవి 2019లో దిలీప్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. గతంలో ఈమె ప్రేమ పెళ్లి చేసుకుందని వార్తలు వినిపించాయి. కానీ పెద్దలు కుదిరిచిన పెళ్లి అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తన భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్… ఆమె మాట్లాడుతూ తన భర్తకు తనకు ఎటువంటి పరిచయం లేదు అని చెప్పింది. పెద్దలు చూసిన పెళ్లి కావడంతో ఆమె మొదట భయపడిన ఆ తర్వాత తన గురించి చెప్పి అతని ఒప్పించి పెళ్లి చేసుకుందని చెప్పింది.. ప్రస్తుతం ఈమెకు ఒక బాబు కూడా ఉన్నాడు. ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తూనే.. మరోవైపు సీరియల్స్ చేస్తుంది.
Also Read :రోహిణి రెండో ప్రగ్నెన్సీ.. షాక్ లో మీనా.. అడ్డంగా ఇరుక్కున్న మనోజ్..
పల్లవి రామిశెట్టి ఆంధ్రా కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో జన్మించింది.. తండ్రి ఉద్యోరిత్యా కుటుంబంతో కొంతకాలం బెంగళూరుకు వెళ్ళింది.. తర్వాత మళ్లీ హైదరాబాద్ కి వచ్చారు. పదో తరగతి వరకు ఆమె ఇక్కడే చదివింది. ఆ టైంలోనే ఈటీవీ ఆడిషన్స్ కి వెళ్ళింది. ఈటివిలో వచ్చిన రంగుల కళ కార్యక్రమంకి వ్యాఖ్యాతగా ఎంపికైంది. ఆ తర్వాత వరుసగా ఈటీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ లకు సెలెక్ట్ అయింది. అలా ఆమె తన కెరీర్ ని మొదలు పెట్టింది.. భార్యామణి సీరియల్లో అలేఖ్య పాత్రలో, ఆడదే ఆధారం సీరియల్లో అమృత పాత్రలో నటించింది. మాటే మంత్రం, అత్తారింటికి దారేది వంటి సీరియల్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అంతే కాదు ఈమధ్య సినిమాల్లో కూడా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ లో ఈమె నటిస్తుంది. వీటితో పాటుగా మరో రెండు ప్రాజెక్టులు కూడా లైన్ లో ఉన్నట్లు తెలుస్తుంది..