E-Paper
Advertisement

AP & TS 10th Class Exams: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. కేంద్రాల వద్ద 144 సెక్షన్

AP & TS 10th Class Exams: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. కేంద్రాల వద్ద 144 సెక్షన్
Advertisement

Tenth Class Exams from Today

Tenth Class Exams in AP and Telangana: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో మార్చి 30 వరకూ, తెలంగాణలో ఏప్రిల్ 2వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్షలు కొనసాగుతాయి. ఏపీలో మొత్తం 7 లక్షల 25 వేల 620 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నాయి. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6 లక్షల 23 వేల 092 మంది ఉండగా.. రీ ఎన్ రోల్ అయినవారు 1,02,528 మంది ఉన్నారు. రెగ్యులర్ స్టూడెంట్స్ లో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు.

Advertisement

కాగా.. పదవ తరగతి పరీక్షల నిర్వహణకై విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా 3,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్షల నేపథ్యంలో ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపించి ఉచితంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చని తెలిపింది.

ఇక నేటి నుంచే ఏపీలో ఒంటిపూట బడులు సైతం ప్రారంభం కానున్నాయి. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ విద్యార్థులకు ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ఒంటిపూటబడులు నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలున్న స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ తరగతులు నిర్వహిస్తారు.

Advertisement

Also Read: ఓటు నమోదుకు మరో అవకాశం.. ఏప్రిల్ 15 వరకు గడువు..

తెలంగాణలో జరిగే పదో తరగతి పరీక్షలకు 5 లక్షల 08 వేల 385 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్షలు కొనసాగుతాయి. మార్చి 26,27 తేదీల్లో జరిగే ఫిజిక్స్, బయాలజీ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకే నిర్వహిస్తారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు డీఈఓలు, సీఎస్ లకు ఆదేశాలు జారీ చేసింది. గతేడాది వరంగల్ లో జరిగిన ఘటన నేపథ్యంలో.. ఈసారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పోలీసులు సైతం భారీ బందోబస్త్ ఏర్పాట్లు చేశారు. పరీక్షల సమయంలో సమీపంలో ఉన్న జిరాక్స్ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags

Related News

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్.. రైతులకు అదిరిపోయే తీపి కబురు!

అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Big Stories

Advertisement
×