E-Paper
Advertisement

New Vote Registration: ఓటు నమోదుకు మరో అవకాశం.. ఏప్రిల్ 15 వరకు గడువు

New Vote Registration: ఓటు నమోదుకు మరో అవకాశం.. ఏప్రిల్ 15 వరకు గడువు
Advertisement

New Voter Registration news

New Vote Registration: ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అదే సమయంలో దేశంలో ఓటర్ల సంఖ్యను సీఈసీ ప్రకటించారు. భారత్ లో 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇప్పటికీ అర్హత ఉన్నా ఓటు హక్కులేని వారికి మరో అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రకటించింది.

Advertisement

తొలుత ఓటర్ల జాబితాలో ఓటు ఉందో ? లేదో చూసుకోవాలి. ఓటు లేకపోతే దరఖాస్తు చేసుకోవాలి. ఓటు మిస్సైన వారు, ఇప్పటి అర్హత ఉన్నా ఓటు రాని వారు ఓటు కోసం నమోదు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సీఈసీ సూచించింది.

ఓటు నమోదు కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా చేపడుతున్నారు. ఏటా జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పిస్తున్నారు. వారు ముందుగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. నెలరోజుల ముందు వరకు కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది.

Advertisement

Also Read : ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్.. రూ.50 వేల కంటే ఎక్కువ ఉంటే ఇక అంతే?

తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 15 లోపు వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పిస్తారు. వారికి ఈ ఎన్నికల్లోనే ఓటు వేసే అవకాశం దక్కుతుంది. కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకునేవారు ఫారం-8 దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

ఆఫ్ లైన్ లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. నియోజకవర్గ ఎలక్షన్ ఆఫీసర్ , సహాయ ఎన్నికల అధికారి, పోలింగ్ కేంద్ర అధికారికి నేరుగా కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఓటులో మార్పులు చేర్పులకు కూడా సీఈసీ అవకాశం కల్పించింది.

Tags

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×