E-Paper
Advertisement

AP National Observer: ఏపీ నేషనల్ అబ్జర్వర్‌గా అదిత స్వప్న.. ప్రకటించిన అఖిల భారత మహిళా కాంగ్రెస్

AP National Observer: ఏపీ నేషనల్ అబ్జర్వర్‌గా అదిత స్వప్న.. ప్రకటించిన అఖిల భారత మహిళా కాంగ్రెస్
Advertisement

AP National Observer: అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ జాతీయ పరిశీలకురాలిగా బి.అదిత స్వప్న నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా ఆదేశాల మేరకు.. ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ జాతీయ అబ్జర్వర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో అదిత స్వప్న బీహార్, పుదుచ్చేరి, అండమాన్ & నికోబార్ దీవులకు జాతీయ పరిశీలకురాలిగా విజయవంతంగా పని చేసిన విషయం తెలిసిందే.

అదిత స్వప్న రియాక్షన్..

తనను అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ జాతీయ పరిశీలకురాలిగా నియమించడంపై అదితా స్వప్న స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నాపై విశ్వాసం ఉంచి, నూతన బాధ్యతను అప్పగించినందుకు అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు’ అని అన్నారు.

అదే నా లక్ష్యం – అదిత స్వప్న

Advertisement

ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా నాయకత్వంలో.. ఆంధ్రప్రదేశ్‌లో మహిళా కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి, అలాగే రాహుల్ గాంధీ దార్శనికత, నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అదిత స్వప్న తెలిపారు. అంతేకాకుండా.. ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్‌ను రాష్ట్రంలోని ప్రతి మండలం, బూత్ స్థాయికి తీసుకెళ్తానని, ఆంధ్రప్రదేశ్ మొత్తం మహిళా కాంగ్రెస్ ఉనికిని విస్తరించడంపై దృష్టి పెడతానని  ఆమె పేర్కొన్నారు. అలాగే మహిళా నాయకులకు సాధికారత కల్పించడం, సంస్థాగత చట్రాన్ని బలోపేతం చేయడం, రాజకీయాల్లో మహిళల సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కోసం అఖిల భారత మహిళా కాంగ్రెస్ తన ప్రయత్నాలను కొనసాగిస్తోందని ఈ సందర్భంగా అదిత స్వప్న తెలిపారు.

Advertisement

 

 

 

Related News

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

Big Stories

Advertisement
×