E-Paper
Advertisement

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!
Advertisement

Naa Anveshana Anvesh:వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఎంతోమందికి మంచి పేరు ప్రఖ్యాతలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షో ఒకవైపు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నప్పటికీ.. మరికొంతమంది దీనిని ఆపివేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను నా అన్వేషణ అన్వేష్ (Naa Anveshana anvesh) ఏకిపారేస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సెప్టెంబర్ ఆరవ తేదీన చాలా గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సడన్గా యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా నాగార్జునతో పాటు బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 జెడ్జెస్ గా వ్యవహరిస్తున్న బిందు మాధవి (Bindhu Madhavi), నవదీప్ (Navdeep), అభిజిత్ (Abijeet Duddala ) లపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

నాగార్జునను ఏకిపారేసిన నా అన్వేషణ అన్వేష్..

అన్వేష్ మాట్లాడుతూ.. “నాగార్జున గారు ఈ ఒక్క విషయం చెప్పండి.. మీ నాన్నగారు స్వర్గీయ నాగేశ్వరరావు గారు మిమ్మల్ని కన్నది ఆకుల్ని తయారు చేయడానికా చెప్పండి.. అగ్ని పరీక్ష అని చెప్పి ఒక రెండు రీల్స్ చూశాను.. ఎవరండీ వీరంతా బోకులు.. పోరంబోకులు.. నాకు తెలియక అడుగుతున్నాను.. వాళ్లు జడ్జిలు ఏంటండీ.

వీళ్లు జడ్జెస్ ఏంటండీ?

Advertisement

ఆ నవదీప్ ఒక పెద్ద పోరంబోకండి.. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. వాడు జడ్జ్ ఏంటి. ఇక బిందు మాధవి హీరోయిన్ అంట. ఆ అమ్మాయి ఏ సినిమాలో చేసింది హీరోయిన్ గా చెప్పండి.. పక్కన అభిజిత్ అని ఒకరిని పెట్టారు. ఆయన ఏ సినిమాలో హీరోగా చేశారండి. ఇలాంటి వాళ్లను జడ్జ్లుగా పెట్టారేంటి. ప్రతి ఏడాది మీకు ఇది అలవాటుగా వస్తోందా ఏంటి? ఆకుల్ని తయారు చేయడం సమాజం మీదకి వదలడం.. ఆ బెట్టింగ్ యాప్ లో సచ్చాను నేను.. ఒక 50 మంది మీ స్కూల్ నుంచి వచ్చినోళ్ళే.. రైతు రైతు అంటూ చెప్పిన పల్లవి ప్రశాంత్ కొండ ఎర్రిపప్పని చేసింది ఫస్ట్ మిమ్మల్నే. ఆ తర్వాత సమాజాన్ని ఎర్రిపప్పలను చేశాడు.

ALSO READ:బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

తప్పుగా అనుకోవద్దు – నా అన్వేషణ

Advertisement

నేను చెప్పేది తప్పుగా అనుకోకండి.. జడ్జిలుగా ఐపీఎస్ సజ్జనార్ సార్ గారిని, ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ సార్ గారిని, ఒక టాప్ డైరెక్టర్ రాజమౌళి గారిని గానీ, ఆర్జీవి లాంటి పెద్ద డైరెక్టర్లను జడ్జిలుగా పెట్టండి పెడితే.. వాళ్లని కాకపోయినా వాళ్ళ రేంజ్ ఉన్న వాళ్ళని జడ్జెస్ గా పెడితే మార్కెట్లోకి ఎంత మంచి ప్రొడక్ట్ ను తీసుకొస్తారండి..
మీరు అనొచ్చు..

వీళ్లు పెద్ద పోరం*బోకులు – నా అన్వేషణ

ఇదొక ఎంటర్టైన్మెంట్ షో అని.. ఎంటర్టైన్మెంట్ షో లలో చదువుకున్న వారు , విద్యావేత్తలు ఉండకూడదా.. 70 ఏళ్ల బ్రహ్మానందం గారు ఆ రోజుల్లోనే మాస్టర్స్ చేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు కొట్టి ఎంత బాగా మనల్ని నవ్వించారు. మీరు మంచి వాళ్ళను జడ్జెస్ గా పెడితే.. వాళ్లు సెలెక్ట్ చేసేవాళ్ళు వజ్రాలు, ఆణిముత్యాలు అవుతారు. ఇలాంటి వాళ్ళను జడ్జెస్ గా పెట్టి.. వీళ్లు బోకులు, పోరంబోకులను తయారు చేసి సమాజం మీదకి వదులుతారు” అంటూ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడు.

?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA==

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు ఘోర అవమానం.. ప్రభాకు మైండ్ బ్లాక్ .. మీనా దెబ్బకు సంజు షాక్..

Podarillu Today Episode : మాధవ్ కు ఏమైంది..? చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ పెళ్లి చూపులు ఫిక్స్..?

Ninnu kori Serial Today Episode September 3rd ‘నిన్ను కోరి’ సీరియల్‌: కామాక్షి, శృతి ల ప్లాన్ సక్సెస్ – చంద్ర ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్     

Big Stories

Advertisement
×