BigTV English
Advertisement

Kakinada : ఫైన్ కట్టమంటే నరికేశాడు.. కాకినాడలో దారుణం..

Kakinada : ఫైన్ కట్టమంటే నరికేశాడు.. కాకినాడలో దారుణం..

Kakinada : మనుషుల్లో ఆవేశం కంట్రోల్ లో ఉండటం లేదు. క్షణికావేశంలో ఎదుట వ్యక్తులపై దాడులకు తెగబడుతున్నారు. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసేందుకు వెనుకాడటంలేదు. తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా కాకినాడలోనూ ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది. రవాణాశాఖ అధికారిపై కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆ అధికారి తీవ్రంగా గాయపడ్డారు.


శుక్రవారం ఉదయం కాకినాడలోని దేవాదాయశాఖ కార్యాలయం సమీపంలో అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం. చిన్నారావు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వాహనాల రికార్డులు, ఫిట్ నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ వివరాలను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో అక్కడ వ్యాన్‌పై ఓ వ్యక్తి కొబ్బరి బొండాలు అమ్ముతున్నాడు. ఆ వాహనంపై గతంలో ఓ చలానా ఉంది. ఆ జరిమానా కట్టాలని కొబ్బరి బొండాలు అమ్మే వ్యక్తిని అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ చిన్నారావు కోరారు.

చలానా చెల్లించమనటంతో చిన్నారావుతో కొబ్బరి బొండాలు అమ్మే వ్యక్తి దుర్గాప్రసాద్ గొడవకు దిగాడు. తన వద్ద ఉన్న కొబ్బరి బొండాలు నరికే కత్తితో చిన్నారావుపై దాడి చేశాడు. ఈ ఘటనలో రవాణాశాఖ అధికారి చేతి బొటనవేలు తెగింది. వెంటనే బాధితుడిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్గారావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Tags

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×