E-Paper
Advertisement

Godavari river news: గోదావరి ఉగ్రరూపం.. ముంపులో గిరిజన గ్రామాలు..

Godavari river news: గోదావరి ఉగ్రరూపం.. ముంపులో గిరిజన గ్రామాలు..
Godavari river flood news

Godavari river flood news(Andhra Pradesh today news): గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. అంతకంతకూ ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 54.6 అడుగులు దాటింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ముంపు బారిన పడిన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కొనసాగుతున్నాయి.

మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన గ్రామాలు వరదలకు అల్లాడుతున్నాయి. ఏజెన్సీలోని 40 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. శ్రీరామగిరి, పోతవరం, జీడిగుప్ప, తుమ్మిళేరు, చినమట్టపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. ఇవన్నీ మారుమూల గ్రామాలే. ఇక్కడ ప్రత్యేక పునరావాస కేంద్రాలు లేవు.

వరద బాధితులు సమీప కొండ ప్రాంతాల్లో గుడారాలు వేసుకున్నారు. 4 రోజులుగా అక్కడే బిక్కుబిక్కుమంటూ గడువుతున్నారు. అపరిశుభ్ర వాతావరణంతో.. బాలింతలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.

Tags

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×