BigTV English

Godavari river news: గోదావరి ఉగ్రరూపం.. ముంపులో గిరిజన గ్రామాలు..

Godavari river news: గోదావరి ఉగ్రరూపం.. ముంపులో గిరిజన గ్రామాలు..
Godavari river flood news

Godavari river flood news(Andhra Pradesh today news): గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. అంతకంతకూ ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 54.6 అడుగులు దాటింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.


ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ముంపు బారిన పడిన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కొనసాగుతున్నాయి.

మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన గ్రామాలు వరదలకు అల్లాడుతున్నాయి. ఏజెన్సీలోని 40 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. శ్రీరామగిరి, పోతవరం, జీడిగుప్ప, తుమ్మిళేరు, చినమట్టపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. ఇవన్నీ మారుమూల గ్రామాలే. ఇక్కడ ప్రత్యేక పునరావాస కేంద్రాలు లేవు.


వరద బాధితులు సమీప కొండ ప్రాంతాల్లో గుడారాలు వేసుకున్నారు. 4 రోజులుగా అక్కడే బిక్కుబిక్కుమంటూ గడువుతున్నారు. అపరిశుభ్ర వాతావరణంతో.. బాలింతలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.

Tags

Related News

Indrakeeladri Rush: కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి.. తిరుమల తరహాలో ఏర్పాట్లు.. నది స్నానాలపై నిషేధం

Mithun Reddy: బిగ్ రిలీఫ్.. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి బెయిల్

Ysrcp Digital Book: రివర్సైన వైసీపీ డిజిటల్ బుక్.. ఆ పార్టీ నేతలపైనే ఫిర్యాదులు!

Antarvedi Sea Retreats: 500 మీటర్లు వెనక్కి.. సునామీ వస్తుందా? అంతర్వేది వద్ద హై అలర్ట్

AP Rains: మహారాష్ట్ర పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. ఏపీకి పొంచివున్న ముప్పు..

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అన్ని కంపార్టుమెంట్లలో భక్తుల రద్దీ

AP News: పోరుబాటలో గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులు.. వాట్సాప్‌ గ్రూప్‌‌ల నుంచి ఎగ్జిట్, అక్టోబర్ ఒకటిన

YCP MLA’s in Assembly: అసెంబ్లీలో మాట్లాడని వైసీపీ ఎమ్మెల్యేలు.. గెలిచి ప్రయోజనమేంటి.?

Big Stories

×