E-Paper
Advertisement

Indrakeeladri Rush: కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి.. తిరుమల తరహాలో ఏర్పాట్లు.. నది స్నానాలపై నిషేధం

Indrakeeladri Rush: కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి.. తిరుమల తరహాలో ఏర్పాట్లు.. నది స్నానాలపై నిషేధం
Advertisement

Indrakeeladri Rush: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రంలో దుర్గమ్మ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. భారీగా భక్తులు వస్తుండడంతో తిరుమల తరహాలో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి నుంచే భక్తులను దర్శనాలకు అనుమతించారు.

కొండపై క్యూలైన్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమ్మవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. వినాయక గుడి నుంచి సుమారు 3 కి.మీ మేర భక్తులు బారులు తీరారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మూలా నక్షత్రం కావడంతో 3 లక్షల పైగా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా వీఐపీ, వీవీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. తిరుమల తరహాలో భక్తులకు హోల్డింగ్ పాయింట్స్, పదికి పైగా కంపాట్మెంట్లు ఏర్పాటు చేశారు.

క్యూలైన్లలో ప్రత్యేక ఏర్పాట్లు

Advertisement

క్లూ లైన్లలోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. క్లూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు మంచినీరు, బిస్కెట్ పాకెట్స్, పాలు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు.భక్తులు ఎంత మంది వచ్చినా కోరినన్ని లడ్డూలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 నిమిషాలకు సీఎం చంద్రబాబు దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

ప్రత్యేక బందోబస్తు

Advertisement

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి వరద ప్రవాహం పెరగడంతో ఘాట్ల వద్ద అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జల్లు స్నానాలు చేసేందుకు భక్తులకు సౌకర్యాలు కల్పించారు. నది ఘాట్‌ల వద్ద స్నానాలు నిషేధించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మోటర్లు, ట్యాప్ ల వద్దనే భక్తులు స్నానాలు చేయాలని సూచించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలకు వచ్చే వారు నిర్ణీత గడువు లోగా ఆలయానికి అధికారులు సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ఘాట్ రోడ్ సహా పలు మార్గాల్లో ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Also Read: Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అన్ని కంపార్టుమెంట్లలో భక్తుల రద్దీ

నదీ స్నానాలపై నిషేధం

ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజీ కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు రెండో నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి 6,57,473 క్యూసెక్కుల వరద వస్తుంది. బ్యారేజీ గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి 5,66,860 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నది ఉద్ధృతంగా ఉండడంతో ఒడ్డున స్నానాలను నిషేధించారు. దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులు జల్లు స్నానాలు మాత్రమే ఆచరించాలని కోరారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×