E-Paper
Advertisement

Gold Seize : ప్రొద్దుటూరులో ఐటీ రైడ్స్.. ఎన్ని వందల కేజీల బంగారం సీజ్ చేశారంటే..?

Gold Seize : ప్రొద్దుటూరులో ఐటీ రైడ్స్.. ఎన్ని వందల కేజీల బంగారం సీజ్ చేశారంటే..?
Advertisement

Gold Seize : ఒకటి కాదు రెండు.. పది కాదు 20 కాదు ఏకంగా 300 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ అధికారుల సోదాలు నిర్వహించారు. నాలుగు గోల్డ్ షాపుల్లో బిల్లులు లేని 300 కిలోల‌ బంగారాన్ని గుర్తించారు.ఆ గోల్డ్ ను సీజ్ చేశారు.

విజ‌య‌వాడ‌,తిరుప‌తికి చెందిన ఐటీ అధికారులు 4 రోజులుగా ప్రొద్దుటూరులో సోదాలు నిర్వహించారు. బుశెట్టి జువెలర్స్‌, డైమండ్స్ , గురురాఘ‌వేంద్ర, త‌ల్లం షాపుల్లో త‌నిఖీలు చేశారు. బిల్లులు లేని బంగారాన్ని సీజ్ చేశారు. ఆ బంగారాన్ని అట్టపెట్టెలు, సూట్‌కేసుల్లో భద్రపరిచారు. ఆ తర్వాత వాహనాల్లో తిరుపతికి తరలించారు. ఆయా షాపుల యజమానులు బిల్లులు లేకుండా భారీగా గోల్డ్ ను దిగుమతి చేసుకున్నారని ఐటీ అధికారులు నిర్ధారించారు.

Advertisement

బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు పెట్టింది పేరు. రెండో ముంబైగా ఖ్యాతి గాంచింది. ఇక్కడ 2 వేలకు పైగా బంగారం, స్వర్ణకారుల షాపులున్నాయి. ఈ ప్రాంతంలో ఎన్నోఏళ్లుగా గోల్డ్ వ్యాపార లావాదేవీలు భారీగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్రమంగా బంగారం దిగుమతి జరుగుతోంది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న అధికారుల 4 దుకాణాల్లో సోదాలు చేపట్టారు.

ఐటీ అధికారుల సోదాలతో ప్రొద్దుటూరులోని బంగారం వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో చాలామంది వ్యారులు బంగారం దుకాణాలను మూసివేశారు. దసరా పండుగ సమయంలోనూ బంగారం దుకాణాలన్నీ మూత పడ్డాయి. దీంతో బంగారం కొనేందుకు షాపుల వద్దకు వచ్చిన వినియోగదారులు నిరాశగా వెనుదిరిగారు.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×