BigTV English
Advertisement

Gold Seize : ప్రొద్దుటూరులో ఐటీ రైడ్స్.. ఎన్ని వందల కేజీల బంగారం సీజ్ చేశారంటే..?

Gold Seize : ప్రొద్దుటూరులో ఐటీ రైడ్స్.. ఎన్ని వందల కేజీల బంగారం సీజ్ చేశారంటే..?

Gold Seize : ఒకటి కాదు రెండు.. పది కాదు 20 కాదు ఏకంగా 300 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ అధికారుల సోదాలు నిర్వహించారు. నాలుగు గోల్డ్ షాపుల్లో బిల్లులు లేని 300 కిలోల‌ బంగారాన్ని గుర్తించారు.ఆ గోల్డ్ ను సీజ్ చేశారు.


విజ‌య‌వాడ‌,తిరుప‌తికి చెందిన ఐటీ అధికారులు 4 రోజులుగా ప్రొద్దుటూరులో సోదాలు నిర్వహించారు. బుశెట్టి జువెలర్స్‌, డైమండ్స్ , గురురాఘ‌వేంద్ర, త‌ల్లం షాపుల్లో త‌నిఖీలు చేశారు. బిల్లులు లేని బంగారాన్ని సీజ్ చేశారు. ఆ బంగారాన్ని అట్టపెట్టెలు, సూట్‌కేసుల్లో భద్రపరిచారు. ఆ తర్వాత వాహనాల్లో తిరుపతికి తరలించారు. ఆయా షాపుల యజమానులు బిల్లులు లేకుండా భారీగా గోల్డ్ ను దిగుమతి చేసుకున్నారని ఐటీ అధికారులు నిర్ధారించారు.

బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు పెట్టింది పేరు. రెండో ముంబైగా ఖ్యాతి గాంచింది. ఇక్కడ 2 వేలకు పైగా బంగారం, స్వర్ణకారుల షాపులున్నాయి. ఈ ప్రాంతంలో ఎన్నోఏళ్లుగా గోల్డ్ వ్యాపార లావాదేవీలు భారీగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్రమంగా బంగారం దిగుమతి జరుగుతోంది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న అధికారుల 4 దుకాణాల్లో సోదాలు చేపట్టారు.


ఐటీ అధికారుల సోదాలతో ప్రొద్దుటూరులోని బంగారం వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో చాలామంది వ్యారులు బంగారం దుకాణాలను మూసివేశారు. దసరా పండుగ సమయంలోనూ బంగారం దుకాణాలన్నీ మూత పడ్డాయి. దీంతో బంగారం కొనేందుకు షాపుల వద్దకు వచ్చిన వినియోగదారులు నిరాశగా వెనుదిరిగారు.

Tags

Related News

Amaravati: ఏపీలో మళ్లీ మొదటి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Lokesh Praja Darbar: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

Rain Alert: ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

VSKP-MBNR Train: విశాఖ-మహబూబ్‌నగర్ రైలుకు తప్పిన ముప్పు.. మార్గ మధ్యలో నిలుపువేత, ఏం జరిగింది?

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Big Stories

×