E-Paper
Advertisement

Ayodhya Temple : టేకు తలుపులు.. బంగారు పూత.. శరవేగంగా రామాలయ నిర్మాణం..

Ayodhya Temple : టేకు తలుపులు.. బంగారు పూత.. శరవేగంగా రామాలయ నిర్మాణం..

Ayodhya Temple : అయోధ్య రామాలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. స్వామివారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా సిద్ధం చేస్తున్నారు. స్వామివారి సింహాసనం, తలుపులు, శిఖరానికి బంగారు పూత పూయడానికి ప్లాన్ చేస్తున్నారు.

రాంలాలా విగ్రహం తయారీ పనులు 80 శాతం పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన 20 శాతం పనులు చివరి దశలో ఉన్నాయి. అవి కూడా చివరి దశకు వచ్చాయని ఉడిపికి చెందిన రామమందిర్ ట్రస్ట్ సభ్యుడు, పీఠాధీశ్వర్ విశ్వతీర్థ ప్రపన్నాచార్య మహరాజ్ తెలిపారు. ఆలయ స్తంభాలపై పలు విగ్రహాలు చెక్కుతున్నారు. ఒక్కో స్తంభంపై 6000 విగ్రహాలు ఉంటాయని రామమందిర్ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా చెప్పారు.

ఆలయంలో మొత్తం 42 తలుపులు ఉంటాయి. అందులో 18 తలుపులు ఆలయ గర్భగుడి సమీపంలో ఉంటాయి. వాటన్నిటికీ బంగారు పూత వేయనున్నారని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి ప్రకాష్ గుప్తా తెలిపారు. ఆలయ నిర్మాణానికి విరాళాల రూపంలో భక్తులు.. బంగారం, వెండి ఇస్తున్నారు. అటు.. శాస్త్రవేత్తల సలహా మేరకు మహారాష్ట్రకు చెందిన టేకు కలపతో తలుపులు తయారు చేస్తున్నారు.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×