Illu Illalu Pillalu Today Episode September 3rd: రామరాజు అరేయ్ తిరుపతి అంటూ గట్టిగా అరవడంతో వంటగదిలో ఉన్న నర్మదా శ్రీవల్లితో పాటుగా వేదవతి నా తమ్ముడు వచ్చేసాడు అని చాలా సంతోషంగా బయటికి వెళుతుంది.. ఏది తిరుపతి వచ్చాడా ఎక్కడున్నాడు అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. మా తమ్ముడు రాలేదు చూశారా అండీ అని వేదవతి రామరాజు దగ్గర మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నేను అడిగినందుకే వాడు ఇంత ఫీల్ అయిపోతాడా ఇన్ని రోజులు ఇవన్నీ కొడుకు లాగా చూశాను. కానీ ఎక్కడ పడునా ప్రేమను చూడలేదు అని బాధపడిపోతూ ఉంటుంది. వేదవతి ఎంత చెప్పినా కూడా రామరాజు మాత్రం బాధపడిపోతూనే ఉంటాడు.. నా తమ్ముడు నన్ను వదిలేసి పోయాడా అని వేదవతి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి రామరాజు కూడా బాధపడతాడు.
కన్నీళ్లు పెట్టుకొని బాధపడిపోతున్న వేదవతి దగ్గరికి నర్మద వెళ్లి మీతో మాట్లాడాలి ఒకసారి బయటికి రండి అని బలవంతంగా బయటికి తీసుకుని వస్తుంది. అక్కడ చూసిన నర్మదా మీరేంటి ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని అడుగుతుంది. నువ్వు కూడా నన్ను తిట్టడానికి వచ్చావా నన్ను అనుమానించావు కదా నేను చాలా బాధపడిపోతున్నాను అని వేదవతి అంటుంది. అసలు జరిగిన మ్యాటర్ ఏంటి అని నర్మద అడుగుతుంది ఆ విషయాన్ని నర్మదకు చెప్తుంది ఇంత జరిగిందా ఇదంతా భాగ్యం బ్యాచ్ ప్లాన్ అయి ఉంటుందని నర్మదా అనుకుంటుంది.. అటు తిరుపతి సుకన్య లేచిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ప్రేమ ఆ విషయం తెలిసి షాక్ అవుతుంది. ఈ దొంగ సుకన్య అని నేను అస్సలు ఒప్పుకోను అని ప్రేమ తిరుపతి తో వాదిస్తుంది.
మా ఇద్దరికీ మీరు పెళ్లి చేయకపోతే మేము లేచిపోయి పెళ్లి చేసుకుంటాము అని తిరుపతి సుకన్య అంటారు.. మీరు లేచిపోయి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి మావయ్య మేమున్నాం కదా మేము చూసుకుంటాము అని ధీరజ్ అంటాడు. ఇక ప్రేమ నేను అస్సలు ఒప్పుకోను అని చెప్తూనే మొత్తానికి ధీరజ్ దారిలోకి వచ్చేస్తుంది. ఇది మన ఇంటిని కూలిపోయిన చేస్తుందని ఎంత చెప్తున్న సరే తిరుపతి మాత్రం అస్సలు వినకుండా ఉంటాడు. మీరిద్దరు చేయకపోతే మేము వెళ్లి చేసుకుంటాము అని తిరుపతి చెప్పడంతో సరే బాబాయ్ నేను పెళ్లి క్యాన్సిల్ చేసేందుకు ఒప్పుకుంటున్నాను అని ప్రేమ అంటుంది.. ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసేందుకు రెడీ అవుతూ ఉంటారు..
ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా భద్రావతి చూసిన పెళ్లి సంబంధం వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ బయట మనుషుల్ని చూసి భయపడి పోతారు.. అక్కడ రౌడీలు వీళ్లిద్దరు గొంతు మీద కత్తులు పెట్టి చంపేస్తాను అని అంటారు. ఇక లోపలికి వెళ్లడానికి చింతామణి కూడా సహాయం చేయడంతో వాళ్ళందరూ లోపలికి వెళ్తారు. ధీరజ్ నేను ఎవరో తెలిస్తే మీరు మాకు దండం పెట్టి లోపలికి రమ్మంటారు అని అంటాడు ఇక చింతామణి వచ్చి వాళ్ళు ఎవరో నిజం చెప్పగానే ఆ రౌడీలు లోపలికి పంపిస్తారు. అయితే ధీరజ్ తిరుపతి మామకి మూడుసార్లు పెళ్లయింది అని అబద్ధం చెప్తాడు.. ఏంది పెళ్లయిందా అతను ఫ్రెష్ కాదా అని అడుగుతారు.. పెళ్లి కూతురు చూసి షాక్ అయినా ధీరజ్ ఆ మాట చెప్పగానే చాలా ఫీల్ అవుతుంది. మాకు ఈ సంబంధం వద్దు ఏమీ వద్దు మేము వేరే సంబంధం చూసుకుంటాము అని ఆ చింతామణి చెప్తుంది.
ఇక నర్మదా బాగ్యం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ ఏం జరిగిందో అన్న విషయాన్ని వివరిస్తూ ఉంటుంది. ఏం జరిగింది అని నర్మదా వాళ్ళని అడుగుతుంది. అయితే ఇదంతా వల్లి భాగ్యం ప్లాన్ అని తెలుసుకున్న నర్మదా అక్కడ ఏం జరిగింది అని అడుగుతుంది. కానీ శ్రీవల్లి మాత్రం మా మీద అనుమాన పడుతున్నావా ఏ నీకేం పని పాట లేదా అని అంటుంది. నర్మదా ఆ మాట అనగానే భాగ్యం వాళ్ళందరూ షాక్ అవుతారు కానీ ఇదంతా చేయడానికి కారణం మీరే మీరు వేసిన చిక్కుముడిని నేనే విప్పాలి కదా అని నర్మదా అంటుంది.. శ్రీవల్లి నర్మదా ఇద్దరు కూడా ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికి నర్మదా అనుమానం నిజమైపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..