E-Paper
Advertisement

Janasena: పార్టీలో ఉంటూ చాప కింద నీరులా.. అడ్డంగా బుక్కైన రామారావు

Janasena: పార్టీలో ఉంటూ చాప కింద నీరులా.. అడ్డంగా బుక్కైన రామారావు
Advertisement

Janasena: వేర్వేరు పార్టీల నుంచి వచ్చిన నేతలపై జనసేన ఫోకస్ చేసిందా? కూటమి సర్కార్ కేసుల నుంచి తప్పించుకునేందుకు వస్తున్నారా? లేకుంటే పార్టీని డ్యామేజ్ చేయడానికి వస్తున్నారా? అనేదానిపై అంతర్గతంగా ఎప్పుటికప్పుడు వివరాలు తెప్పించుకుంటోందట జనసేన హైకమాండ్. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుపై వేటు వేసింది. అసలేం ఏం జరిగింది?

ఏపీలో వైసీపీ అధికారం పోయిన తర్వాత నేతలు వలసపోతున్నారు.  మరో పదేళ్లు వైసీపీలో లైఫ్ ఉండదని భావిస్తున్నారు నేతలు. ఈ క్రమంలో కూటమిలోని పార్టీల వైపు చూస్తున్నారు. తొలుత టీడీపీతో సంప్రదింపులు చేస్తున్నారు. కాదంటే జనసేన వైపు వెళ్తున్నారు. అక్కడ సానుకూలంగా లేకుంటే బీజేపీ వైపు వెళ్తున్నారు.

Advertisement

అలాంటి వారిలో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఒకరు. టీడీపీతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నర్సింగ్ కాలేజీ వివాదం ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. దీంతో టీడీపీ పక్కన పెట్టింది. ఈలోగా రాష్ట్ర విభజన జరగడంతో సైలెంట్ అయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలోకి వెళ్లారు.

ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన వైపు వెళ్లడం, ఆయనకు కొవ్వూరు నియోజకవర్గం బాధ్యతలను ఆ పార్టీ అప్పగించింది.  తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో 14 సొసైటీలు ఉన్నాయి. అందులో మూడు పదవులు తమకు కేటాయించాలని ఆ నియోజకవర్గం ఇన్‌ఛార్జి టీవీ రామారావు పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన నిర్వహించారు.

Advertisement

ALSO READ: విజయసాయిరెడ్డికి సిట్ మళ్లీ పిలుపు

హైకమాండ్‌ని సంప్రదించకుండా ఆయన ఆందోళన చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది జనసేన. పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా రామారావు కామెంట్స్, కార్యక్రమాలు నిర్వహించడం పార్టీ దృష్టికి వచ్చింది. దీనిపై ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హైకమాండ్ వేటు వేసింది.

కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగేలా రామారావు చర్యలు ఉన్నాయని, అందుకే నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తక్షణమే తప్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ అజయ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రామారావును ఆదేశించింది. మొత్తానికి తక్కువ సమయంలో టీవీ రామారావు టీడీపీ మొదలు జనసేన వరకు పార్టీలు మారారు. ఇక ఆయనకు మిగిలిన ఏకైక ఆప్షన్ బీజేపీ మాత్రమే.

 

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×