BigTV English
Advertisement

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Amazon-Walmart: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన డబుల్ టారిఫ్‌పై వ్యాపారవర్గాలు ఆలోచనలో పడ్డాయా? పన్నుల భారం ఎవరిపై పడనుంది? కొనుగోలు చేసేవారిపైనా? ఉత్పత్తి చేస్తున్న వారిపైనా? ఇవే ప్రశ్న చాలామందిని వెంటాడుతున్నాయి. ఇరుదేశాల మధ్య ట్రేడ్ వార్ నేపథ్యంలో అమెరికా రిటైల్ దిగ్గజాలు అలర్ట్ అయ్యాయి. ఈ వ్యవహారం సద్దు మణిగేవరకు భారత్ నుంచి వచ్చే వస్తువుల దిగుమతులను నిలిపి వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పగబట్టాడు. భారత్ వస్తువులపై 50 శాతం సుంకాలు వేయడంతో వ్యాపార వర్గాల్లో అయోమయం నెలకొంది. ఇరుదేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో అమెరికా రిటైల్‌ వ్యాపార దిగ్గజాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి స్టాక్ దిగుమతులను నిలిపి వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ, ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

దుస్తులు, ఫ్యాషన్‌ వస్తువులపై ఎగుమతులను నిలిపివేయాలని కోరుతూ అమెరికా వ్యాపారసంస్థలు భారత్‌లోని టోకు వర్తకులకు మెయిల్స్‌ పంపినట్లు అందులోని సారాంశం. వాటిలో వాల్‌మార్ట్‌, అమెజాన్‌, టార్గెన్‌, గ్యాప్‌ లాంటి సంస్థలు వాటిని పంపినట్లు తెలుస్తోంది. సుంకాల పెంపుతో ఉత్పత్తులపై పడే అదనపు భారం మోసేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా లేరన్నది అసలు సారాంశం. ఒకవేళ పంపిస్తే ఆ ఖర్చును ఎగుమతిదారులు భరించాలని ఆయా సంస్థలు డిమాండ్‌ చేస్తున్నట్లు రాసుకొచ్చాయి.


అమెరికా సుంకాల పెంపుతో భారత ఉత్పత్తులపై ధరఅమాంతంగా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి. కొనుగోళ్లు ఆగిపోతే ఇండియా నుంచి అమెరికాకు వెళ్లే ఆర్డర్లు దాదాపు 50 శాతం తగ్గవచ్చని వస్త్ర పరిశ్రమ వర్గాలు అంచనా. ఫలితంగా ఆయా రంగాలకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. భారత్‌లో వెల్‌ స్పన్‌ లివింగ్‌, గోకల్‌దాస్‌ ఎక్స్‌పోర్ట్స్‌, ఇండోకౌంట్‌, ట్రైడెంట్‌ సంస్థలు టెక్స్‌టైల్‌ వస్తువులను ఎగుమతులు చేస్తున్నాయి. 40 నుంచి 70 శాతం అమెరికాకు పంపిస్తున్నాయి.

ALSO READ: భారీ షాకిచ్చిన బంగారం ధరలు, తులం ఎంతో తెలుసా?

సుంకాల పెంపు నేపథ్యంలో అమెరికా నుంచి వచ్చే ఆర్డర్లు తగ్గుతాయని ఎగుమతిదారులు ఆందోళన. భారతీయ దుస్తులు, ఫ్యాషన్‌ ఉత్పత్తులకు అమెరికా అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. గతేడాది ఈ రంగానికి సంబంధించి 36.61 బిలియన్‌ డాలర్ల మేరా వస్తువులను భారత్ ఎగుమతి చేసింది. అందులో 28 శాతం అమెరికాకు వెళ్లాయి. బంగ్లాదేశ్‌, వియత్నాం లాంటి దేశాలపై 20 శాతం టారిఫ్‌లు వేసింది ట్రంప్ సర్కార్. అమెరికా సంస్థలు టెక్స్‌టైల్‌ ఉత్పత్తుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

Related News

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

Big Stories

×