E-Paper
Advertisement

NTR : తాత శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ దూరం.. ఏమైంది..?

NTR : తాత శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ దూరం.. ఏమైంది..?
Advertisement

NTR News Latest(Breaking news in Andhra Pradesh): హైదరాబాద్ కూకట్‌పల్లిలోని కైత్లాపూర్‌ మైదానంలో సాయంత్రం జరిగే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియర్ NTR దూరంగా ఉండబోతున్నాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు, పవన్, రామ్ చరణ్‌తోపాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. కానీ తారక్ మాత్రం వేడుకలకు హాజరు కావడం లేదు.

నేడు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే. ఈ నేపథ్యంలో పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరుకావడంలేదని ప్రకటించాడు. నందమూరి నటవారసుడిగా పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్.. తాత శతజయంతి వేడుకలకు దూరంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాత అంటే జూనియర్ ఎన్టీఆర్‌కు చెప్పలేనంత అభిమానం. కానీ టీడీపీకి దూరంగా ఉండాలనే ఈ ఉత్సవాలకు వెళ్లడం లేదా..? అనే వార్తలు వినిపిస్తున్నాయి.లేక విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను పిలిచి తనను పిలవనందుకు అలిగాడా..? అని మరో ప్రచారం కూడా జరుగుతోంది.

హైదరాబాద్‌లో జరిగే వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించినా.. చంద్రబాబు వస్తున్నారని వెళ్లడం లేదా? అని తమ్ముళ్ల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఓవైపు చంద్రబాబు పర్యటనల్లో టీడీపీ కార్యకర్తలు పదే పదే NTR పేరును ప్రస్తావిస్తూ నినాదాలు చేస్తున్నారు. తాను మాత్రం పార్టీకి దూరంగా ఉండాలనుకోవడానికి కారణాలేంటి..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తంమీద వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండనుండటం.. ఎన్నో అనుమానాలను కలిగిస్తోంది.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×