BigTV English
Prodduturu TDP : వైసీపీ కంచుకోటపై టీడీపీ ఫోకస్.. ప్రొద్దుటూరు టికెట్ కోసం తమ్ముళ్ల ఫైట్..
Kalyandurg TDP : కళ్యాణదుర్గంలో తెలుగు తమ్ముళ్ల పంతం.. టికెట్ కోసం పోటాపోటి..

Kalyandurg TDP : కళ్యాణదుర్గంలో తెలుగు తమ్ముళ్ల పంతం.. టికెట్ కోసం పోటాపోటి..

Kalyandurg TDP : కళ్యాణదుర్గం టీడీపీలో మూడుముక్కలాట నడుస్తోంది.. అక్కడ టికెట్ కోసం ముందు నుంచి ఇద్దరు సీనియర్ల మధ్య గట్టి పోటీ కనిపించింది. వారిలో ఒక్కరు కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే.. మరొకరు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేత.. ఈ సారి వారిద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుందా అని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తుంటే.. ఇప్పుడు టికెట్ రేసులోకి ఒక కాంట్రాక్టర్ కూడా వచ్చి చేరారు. గతంలో పీఆర్పీలో పనిచేసిన ఆ బడా కాంట్రాక్టర్ టీడీపీ టికెట్ కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసుకుంటున్నారంట. దాంతో కళ్యాణదుర్గం టీడీపీ రాజకీయం ఆసక్తికరంగా తయారైంది.

Ayyanna Patrudu : షర్మిలకు ప్రాణహాని.. భద్రత పెంచాలి..
MLA Prasada Raju : మా టార్గెట్ 175.. గవర్నమెంట్ కాదు..
Shilpa Brothers : నంద్యాల వైసీపీలో ఇంటర్నల్ వార్‌.. టీడీపీ టచ్‌లోకి శిల్పా బ్రదర్స్..?

Shilpa Brothers : నంద్యాల వైసీపీలో ఇంటర్నల్ వార్‌.. టీడీపీ టచ్‌లోకి శిల్పా బ్రదర్స్..?

Shilpa Brothers : వైసీపీలో ఇన్చార్జిల మార్పులు చేర్పుల హడావుడి కొనసాగుతూనే ఉంది. దాంతో తాడేపల్లి నుంచి ఫోన్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ టికెట్ ఆశావహులు ఉలిక్కి పడుతున్నారు . అదే టెన్షన్ కర్నూలు జిల్లా వైసీపీ నేతల్లోనూ కనిపిస్తోంది. పార్టీ పెదల నుంచి ఫోన్ అంటే వికెట్ పడినట్లే అన్న భయం వారిలో కనిపిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో జరిగిన మార్పులతో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక కీలకమైన నంద్యాల, శ్రీశైలం సెగ్మెంట్లపై ప్రకటన రావాల్సి ఉంది.. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర, శ్రీశైలంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిలకు ఈ సారి టికెట్లు దక్కవన్న ప్రచారం జరుగుతోంది. దాంతో వారి వర్గీయుల్లో ఉత్కంఠ నెలకొంది.

AP BRS : ఏపీలో బీఆర్ఎస్ దుకాణం బంద్..? పక్క చూపులు చూస్తున్న నేతలు..

AP BRS : ఏపీలో బీఆర్ఎస్ దుకాణం బంద్..? పక్క చూపులు చూస్తున్న నేతలు..

AP BRS : ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి ఏం చేస్తోంది? అసలు ఆ పార్టీ రాష్ట్ర శాఖ ఉన్నట్లా? లేనట్లా? జాతీయ రాజకీయాలంటూ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేశారు కేసీఆర్. ఆ క్రమంలో ఏపీపై ఫోకస్ పెట్టారు. స్టేట్ బీఆర్ఎస్ కమిటీని కూడా ప్రకటించారు. మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌ని ఏపీ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించారు. స్టార్టింగ్‌లో ఆ పార్టీలో కొంత హడావుడి కనిపించినప్పటికీ.. ఇప్పుడు ఏపీ బీఆర్ఎస్ సైలెంట్ అయిపోయింది. ఆ పార్టీలో చేరిన అరకొర నేతలే పక్క చూపులు చూసున్నట్లు కనిపిస్తున్నారు. దాంతో అసలు అక్కడ బీఆర్ఎస్ ఉందా? లేదా? అన్నట్లు తయారైంది పరిస్థితి.

Minister Roja  : ఒంగోలు బరిలో రోజా..! వ్యతిరేకిస్తున్న బాలినేని..

Minister Roja : ఒంగోలు బరిలో రోజా..! వ్యతిరేకిస్తున్న బాలినేని..

Minister Roja : ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని కాదనుకున్న వైసీపీ.. కొత్త అభ్యర్ధి ఎంపికకు పెద్ద కసరత్తే చేస్తోంది. వైసీపీ పెద్దలు సమర్ధుడైన అభ్యర్థి కోసం ఎవరెవరి పేర్లో పరిశీలిస్తున్నారు. చెవిరెడ్డి దగ్గర నుంచి మాజీ మంత్రి బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి వరకు ఒంగోలు ఎంపీ టికెట్ రేసులో చాలా మంది పేర్లే ఫోకస్ అవుతున్నాయి. తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఒంగోలు సీన్‌లోకి వచ్చేశారు. ఈ మంత్రి గారికి నగరిలో పరిస్థితులు అనుకూలంగా లేవని.. అందుకే ఒంగోలు షిష్ట్ చేస్తారన్న ప్రచారం మొదలైంది. అయితే ఆ ప్రచారంపై రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారిప్పుడు.

Vemireddy : నెల్లూరు పాలిటిక్స్.. వేమిరెడ్డి హవా నడుస్తోందా..?

Vemireddy : నెల్లూరు పాలిటిక్స్.. వేమిరెడ్డి హవా నడుస్తోందా..?

Vemireddy : నెల్లూరు జిల్లా రాజకీయాలు ఊహించని టర్న్ తీసుకుంటున్నాయి. రెండు సార్లు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా.. సీఎం జగన్ తొలి మంత్రి వర్గంలో కీలకమైన జల వనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అనిల్‌యాదవ్‌ను నరసరావుపేట ఎంపీ అభ్యర్ధిగా పంపడం దాదాపు ఖాయమైందంటున్నారు .. మరి జగన్ ఆయన్ని అక్కడకు పంపుతారో లేదో కాని. ఇప్పటికే నెల్లూరు లోక్‌సభ నుంచి పోటీకి సిద్దమైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి.. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే సీటును కూడా రిజర్వ్ చేసుకున్నారంట.. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌ను వ్యతిరేకిస్తున్న వేమిరెడ్డి.. ఆ స్థానం నుంచి తన భార్య ప్రశాంతిరెడ్డిని ఎన్నికల బరిలో దింపాలని చూస్తున్నారంట.. కుటుంబంలో ఒకరికే సీటు అంటున్న వైసీపీ వేమిరెడ్డి విషయంలో సడలింపు ఇచ్చిందన్న ప్రచారం కూడా మొదలైంది.

Razole Janasena : టార్గెట్ రాపాక.. రగిలిపోతున్న జనసైనికులు..

Razole Janasena : టార్గెట్ రాపాక.. రగిలిపోతున్న జనసైనికులు..

Razole Janasena Candidate : గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక సీటు రాజోలు.. దాంతో మళ్లీ అక్కడ నుంచి తామే పోటీ చేస్తామంటున్నారు జనసైనికులు. సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రాకముందే రాజోలు నుంచి తమ పార్టీనే పోటీ చేస్తుందని ప్రకటించారు. పవన్‌‌కళ్యాణ్.. అలా కర్చీఫ్ వేశేసారు కాని.. కేండెట్‌ని మాత్రం ప్రకటించలేదు.. అసలు అక్కడ జనసేన నుంచి పోటీ చేసేది ఎవరు?.. అక్కడి ప్రజలు మళ్లీ ఆ పార్టీకి పట్టం కడతారా? రాజోలులో టీడీపీకి బలమైన అభ్యర్ధిగా ఉన్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు వర్గం ఆయనకి సహకరిస్తుందా ..? అన్న అంశాలు ఆసక్తికరంగా తయారయ్యాయి.

AP LAND Titling Act | ఏపీలో కొత్త భూ హక్కుల చట్టం.. ‘ప్రజా హక్కులను హరించే విధంగా నిబంధనలు’!
TTD : టీటీడీ కీలక నిర్ణయం.. వార్షిక బడ్జెట్‌కు ఆమోదం..
YCP Rebel MLAs : స్పీకర్ నోటీస్ పై సవాల్..  హైకోర్టులో పిటిషన్..
YS Sharmila : షర్మిలతో వివేకా కుమార్తె భేటీ.. సునీత పొలిటికల్ ఎంట్రీపై చర్చ..
Galla Jayadev : రాజకీయ వనవాసమే.. ఈ బ్రేక్ తాత్కాలికమే..!
Kanna Lakshminarayana : వీధి లైట్లు ఆపేసి.. కన్నా లక్ష్మీనారాయణపై రాళ్ల దాడి..

Big Stories

×