E-Paper
Advertisement

KA Paul: ‘బాలయ్య కడుపు చేస్తా’ అంటే ఏం చేశారు?.. శివాజీ వివాదంపై కేఏ పాల్ ఫైర్

KA Paul: ‘బాలయ్య కడుపు చేస్తా’ అంటే ఏం చేశారు?.. శివాజీ వివాదంపై కేఏ పాల్ ఫైర్
Advertisement

KA Paul: హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన కామెంట్స్‌పై ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. తన వ్యాఖ్యల పట్ల మహిళా కమిషన్ ముందు శివాజీ క్షమాపణ చెప్పారని, కానీ ఆయన ఎవరినీ కించపరచాలని అలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. మరోవైపు ఓ ఈవెంట్‌లో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ‘మహిళలకు కడుపు చేయాలి’ అని చెప్పిన మాటలను కేఏ పాల్ గుర్తు చేశారు. మరి బాలయ్యపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ పార్టీల మద్దతు వల్ల బాలయ్యపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

టీడీపీ-బీజేపీ పొత్తు వల్లే

“బాలయ్యపై చర్యలు తీసుకోలేదేం. ఎందుకంటే బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే.. టీడీపీ, బీజేపీ పొత్తులో ఉన్నాయి. అందుకే బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు ఇచ్చారు. వచ్చే ఏడాది భారతరత్న కూడా ఇవ్వొచ్చు. ఎందుకు ఆయన బీజేపీ పొత్తులో ఉన్నారు కాబట్టి. బీజేపీ ఎంపీ ఒకరు అత్యాచార కేసులో అరెస్టు అయ్యారు. సీబీఐ ఆ కేసును దర్యాప్తు చేసింది. అయినా అతడికి బెయిల్ వచ్చింది. అత్యాచార బాధితురాలు తనకు ప్రాణహాని ఉందని పదే పదే చెప్పినా..ఆ బీజేపీ నేతకు బెయిల్ వచ్చింది. నటుడు శివాజీ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని పొడుగుతున్నారు. అందుకే అతడిని నోటీసులు ఇస్తున్నారు. ప్రధాని మోదీ క్రిస్మస్ నాడు చర్చికి వెళ్లారు. సందేశం ఇచ్చారు. కానీ దేశ వ్యాప్తంగా చర్చిలపై దాడులు జరుగుతున్నాయి. అలా జరగకుండా చర్యలు తీసుకోవాలి. దేశాన్ని కాపాడాలి” -కేఏ పాల్

అసలేంటీ వివాదం?

Advertisement

హీరోయిన్లు బయటకు వచ్చినప్పుడు నిండుగా బట్టలు వేసుకోవాలనే ఉద్దేశంలో శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల దుస్తులు విషయంలో శివాజీ నుంచి సలహాలు అవసరం లేదని అనసూయ బహిరంగంగా కామెంట్స్ చేశారు. మెగా బ్రదర్ నాగబాబు, ప్రకాష్ రాజ్ శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

శివాజీ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. శివాజీ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి విచారణకు పిలిచింది. మహిళా కమిషన్ ముందు హాజరైన తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎవరినీ అవమానించాలన్న ఉద్దేశం తనకు చెప్పుకొచ్చారు. తాజాగా ఈ వివాదంపై కేఏ పాల్ స్పందించారు. బాలయ్య మహిళలపై ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. శివాజీకి మద్దతుగా నిలిచారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×