E-Paper
Advertisement

Nara Lokesh: అసెంబ్లీకి రాకుండా బెంగళూరు వెళ్లడమేంటి? జగన్‌పై మంత్రి లోకేష్ ఘాటు విమర్శలు!

Nara Lokesh: అసెంబ్లీకి రాకుండా బెంగళూరు వెళ్లడమేంటి? జగన్‌పై మంత్రి లోకేష్ ఘాటు విమర్శలు!
Advertisement

Nara Lokesh: మంత్రి నారా లోకేష్ ఇటీవల అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆయన సంధించిన విమర్శనాస్త్రాలు, ముఖ్యంగా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై వేసిన సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జగన్ అజ్ఞాత రాజకీయంపై లోకేష్ సెటైర్లు
శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా బెంగళూరు ప్యాలెస్‌కే పరిమితమైన జగన్ తీరును లోకేష్ తీవ్రంగా తప్పుబట్టారు. అమరావతిపై మండలిలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ నాయకులు, ముందు అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ధైర్యం చేయాలని సవాలు విసిరారు. ప్రజలు ఎన్నుకున్నది అసెంబ్లీలో గొంతు విప్పడానికా లేక బెంగళూరులో విశ్రాంతి తీసుకోవడానికా? అని ప్రశ్నిస్తూ, జగన్‌కు ఎలాగూ ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉంది కాబట్టి, బహుశా అసెంబ్లీకి రాకుండానే జూమ్ ద్వారా అదృశ్య రూపంలో వస్తారేమోనని ఎద్దేవా చేశారు.

Advertisement

పరామర్శల వెనుక అసలు ఉద్దేశం అదేనా?
అంతేకాకుండా రాష్ట్రంలో జగన్ చేపడుతున్న పరామర్శల యాత్రలు కేవలం వివాదాలు సృష్టించడానికేనని మంత్రి ఆరోపించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, రాజకీయ లబ్ధి పొందడమే వైసీపీ వ్యూహమని విమర్శించారు. గత ఐదేళ్ల పాలనలో ప్రజలకు సినిమా చూపించినందుకే, ఇప్పుడు జనం తిరిగి జగన్‌కు అసలైన సినిమా చూపించి కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఇంకా డ్రామాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు.

సజ్జల టార్గెట్‌గా లోకేష్ ప్రశ్నల వర్షం
అలాగే వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని సజ్జలకు అసెంబ్లీ వ్యవహారాల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. “ప్రజల తీర్పు పొందని వ్యక్తి, ప్రజాస్వామ్య దేవాలయం గురించి నీతులు చెప్పడం హాస్యాస్పదం” అని లోకేష్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రాకుండా బయట ఉండి ప్రగల్భాలు పలికే నాయకుల మాటలను ఎవరూ నమ్మరని తేల్చి చెప్పారు.

Advertisement

రాజధానిపై వైసీపీ ద్వంద్వ వైఖరి
అమరావతి విషయంలో వైసీపీకి స్పష్టమైన స్టాండ్ లేదని లోకేష్ ఎండగట్టారు. గతంలో మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర భవిష్యత్తును గాలికి వదిలేసిన వైసీపీ, ఇప్పుడు మండలిలో తీర్మానాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అసలు రాజధాని విషయంలో మీ పార్టీ విధానం ఏంటో ప్రజలకు చెప్పగలరా అని నిలదీశారు. అమరావతి అభివృద్ధికి అడ్డుపడటమే లక్ష్యంగా వైసీపీ డ్రామాలు ఆడుతోందని, కానీ తమ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Also Read: పార్లమెంటుకు రాజధాని బిల్లు.. ఇరకాటంలో వైసీపీ!

మార్పు దిశగా కూటమి అడుగులు..
ప్రజా సమస్యలను చర్చించాల్సిన వేదికను వదిలేసి, వైసీపీ నేతలు పారిపోతున్నారని లోకేష్ అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో నమ్మకం పెరిగిందని, గత పాలకుల విధ్వంసాన్ని సరిదిద్దుతూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించడం చేతగాక, వైసీపీ నేతలు తలో దిక్కుకు పారిపోతున్నారని ఆయన చిట్ చాట్‌లో ఎద్దేవా చేశారు.

Related News

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Big Stories

Advertisement
×