YS Jagan: ఏపీలోని గుంటూరు నగరంలో మహిళను వివస్త్రను చేసిన ఘటనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడు చేసిన ఈ దాడి మానవత్వానికే మాయని మచ్చ అని మండిపడ్డారు. రాష్ట్రంలోని శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పేందుకు ఈ ఘటనే నిలువెత్తు నిదర్శనమని విమర్శించారు. సీఎం చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఘాటుగా వాఖ్యానించారు.
బుధవారం జరిగిన ఈ ఘటనను 3 రోజుల పాటు కప్పి పెట్టారని ఎక్స్ వేదికగా జగన్ ఆరోపించారు. చివరకు వీడియోలు బయటకు రావడంతో.. ప్రజలంతా చూసి అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు తానేదో చర్యలు తీసుకుంటున్నట్లుగా చంద్రబాబు హడావుడి చేయడం సిగ్గుచేటన్నారు. ఆ వీడియోలు కప్పిపుచ్చేదానిపై చూపిన శ్రద్ద.. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పుడే తీసుకొని ఉంటే బాగుండేదని పేర్కొన్నారు.
బాధితురాలు ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేసి.. నిందుతుల్ని అదుపులోకి తీసుకొని ఉంటే ఈ దారుణం జరిగేదా? అని ప్రశ్నించారు. ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయం? అని నిలదీశారు. ‘పోలీస్స్టేషన్లు ఉన్నది ఎందుకు? బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా? లేక అధికార పార్టీ నాయకులు ఏంచెప్తే అది చేయడానికా?’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నేతలు, శ్రేణులపై దాడులను చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని జగన్ అన్నారు. ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చారన్నారు. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా చేసుకున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు, బాధితులపై అక్రమంగా కేసులు పెడుతూ.. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ గా దిగజార్చారని పేర్కొన్నారు.
Also Read: లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!
అధికార పార్టీ నాయకులు ఏం చేసినా ఈ పోలీసులు తమను రక్షిస్తారనే ధైర్యం ఊరూరా పాకిందన్నారు. అందుకే టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారంటూ ఘాటుగా విమర్శించారు. దారుణాలు చేసినా, మహిళలను అవమానించినా తమను కాపాడటానికి చంద్రబాబు ఉన్నారనే ధైర్యం టీడీపీ నేతలు, శ్రేణుల్లో పెరిగిందన్నారు. ఇది చివరకు రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా చేసిందని జగన్ మండిపడ్డారు.
గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి.
బుధవారం ఘటన జరిగితే.. మూడు…
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 18, 2026
Also Read: Construction Waste: హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్ఫుల్..?