E-Paper
Advertisement

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం
Advertisement

Visakha Accident: విశాఖ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. అతి వేగంగా వస్తున్న ఓ కారు.. లారీ ఢీ కొట్టింది. స్పాట్‌లో నలుగురు మృత్యువాతపడ్డారు. మరొకర తీవ్రంగా గాయపడ్డారు. అసలు ఘటన ఎలా జరిగింది?

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం-విశాఖ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారి సమీపంలో ఈ ఘటన జరిగింది. పల్నాడు జిల్లా వినుకొండ నుంచి కారులో శ్రీకాకుళం జిల్లాకు ఓ ఫ్యామిలీ వెళ్తోంది. టెక్కలిలో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తోంది.

Advertisement

లారీని ఢీ కొట్టిన కారు-అయితే కారు ఆనందపురం సమీపంలోని గండిగుండం వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని అదుపుతప్పి బలంగా లారీని ఢీ కొట్టింది. ఘటన సమయంలో కారులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. కారు డ్రైవర్‌ సహా నలుగురు స్పాట్‌లో మృతి చెందారు. నరసరాపుపేట ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్‌ గాయపడినట్టు తెలుస్తోంది.

స్పాట్‌లో నలుగురు మృతి-ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్స్ అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఎమ్మెల్యే పీఏను చికిత్స కోసం విశాఖలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో చంద్రశేఖర్‌ కొడుకు ఉన్నట్ల్లు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు,  వివరాలు సేకరించారు.  చంద్రశేఖర్ కుమారుడు భవాని శంకర్ మృతి చెందాడు.

Advertisement

ALSO READ: ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

మృతులు  వినుకొండ నియోజకవర్గానికి చెందినవారు.  ఈ ఘటనలో పాలగాని రామాంజనేయులు, షేక్ మీరావలి, మందపాటి భవాని శంకర్ మృతి చెందారు. నరసరావుపేటకు చెందిన డ్రైవర్ శ్రీను చనిపోయినవారిలో ఉన్నాడు. ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.  ప్రమాదంలో చనిపోయిన మృతులు తనకు అత్యంత ఆప్తులని చెప్పారు.

.

 

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×