E-Paper
Advertisement

Road Accident : సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఏడుగురు మృతి..

Road Accident : సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఏడుగురు మృతి..

Road Accident : ప్రకాశం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. దర్శి సమీపంలో సాగర్‌ కాల్వలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. 18 మందికి గాయాలయ్యాయి. ఈ బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద జరిగిన సమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నారు.

పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పొదిలికి చెందిన ఓ కుటుంబం వివాహ రిసెప్షన్‌ కోసం కాకినాడ వెళ్లేందుకు ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనలో అబ్దుల్‌ అజీజ్‌(65), ముల్లా జానీబేగం(65), అబ్దుల్‌ హాని(60), ముల్లా నూర్జహాన్‌ (58), షేక్‌ రమీజా (48),షేక్‌ షబీనా(35),షేక్‌ హీనా(6) ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు క్షతగాత్రులను ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. మృతురాలు షేక్‌ రమీజా భర్త చెన్నైలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కాకినాడకు రైలులో వెళ్లారు. దీంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

ప్రమాదస్థలిని ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ పరిశీలించారు. దర్శిలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×