BigTV English
Advertisement

Road Accident : కడప జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి..

Road Accident : కడప జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి..

Road Accident : వైఎస్ఆర్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో అనంతపురం జిల్లా తాడిపత్రి, కర్ణాటకలోని బళ్లారికి చెందిన 14 మంది వాహనంలో ఉన్నారు. వారంతా తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి తుఫాన్‌ వాహనంలో వెళ్లారు. దర్శనం తర్వాత అదే వాహనంలో స్వగ్రామాలకు తిరిగి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు.


కడప -తాడిపత్రి ప్రధాన రహదారిలో కొండాపూర్‌ మండలం ఏటూరు గ్రామానికి సమీపంలో తుఫాన్‌ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమాచారం తెలియగానే సీఐ సుదర్శన్‌ ప్రసాద్‌, ఎస్ఐ సత్యనారాయణ ఘటనాస్థలికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.


Related News

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Spurious Ghee: కోటి సంతకాల సంగతి దేవుడెరుగు.. ముందు కల్తీ నెయ్యిలోనుంచి బయటపడేదెలా?

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

AP Cabinet Decisions: రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. మరిన్ని కీలక నిర్ణయాలు

Top 20 News @ 8 PM: కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఆరోపణలు, ఉపాధ్యాయుడు దాడి.. వినికిడి కోల్పోయిన విద్యార్ధి

Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు..!

Top 20 News @ 6 PM: అందెశ్రీ ఇక లేరు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు.. నేటి టాప్ 20 న్యూస్ ఇవే!

Lokesh Tweet: ఇది హిందువుల విశ్వాసాలపై జరిగిన దాడి.. లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×