Big Stories

Road Accident : కడప జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి..

Road Accident : వైఎస్ఆర్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో అనంతపురం జిల్లా తాడిపత్రి, కర్ణాటకలోని బళ్లారికి చెందిన 14 మంది వాహనంలో ఉన్నారు. వారంతా తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి తుఫాన్‌ వాహనంలో వెళ్లారు. దర్శనం తర్వాత అదే వాహనంలో స్వగ్రామాలకు తిరిగి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు.

- Advertisement -

కడప -తాడిపత్రి ప్రధాన రహదారిలో కొండాపూర్‌ మండలం ఏటూరు గ్రామానికి సమీపంలో తుఫాన్‌ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమాచారం తెలియగానే సీఐ సుదర్శన్‌ ప్రసాద్‌, ఎస్ఐ సత్యనారాయణ ఘటనాస్థలికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News