Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓటర్ల నాడిని సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఉపఎన్నికపై ఇంపాక్ట్ సర్వేస్ బై బిగ్టీవీ ప్రీపోల్ సర్వే నిర్వహించింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 8 మధ్య ఇంపాక్ట్ సర్వేస్ బై బిగ్టీవీ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సంచలన ఫలితాలు వచ్చాయి. జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నట్లు స్పష్టమైంది. బిగ్టీవీ సర్వేలో కాంగ్రెస్ వైపు 48.6 శాతం ఓటర్లు ఉండగా, బీఆర్ఎస్ వైపు 44.7 శాతం, బీజేపీ వైపు 4.9 శాతం ఓటర్లు ఉన్నారు.
యూసఫ్గూడ, రహమత్నగర్, ఎర్రగడ్డల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉండగా, బోరబండ, షేక్పేట్లో బీఆర్ఎస్ బలంగా కనిపిస్తుంది. జూబ్లీహిల్స్లో ఎక్కడా బీజేపీ ప్రభావం కనిపించడంలేదని సర్వేలో స్పష్టమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య 4 శాతం ఓట్ల తేడా ఉండనుందని సర్వేలో తేలింది. మరోసారి బీజేపీ మూడోస్థానానికే పరిమితం కానుందని బిగ్ టీవీ సర్వే తేల్చింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోల్ మేనేజ్మెంట్ కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: Mahesh Kumar Goud: బీజేపీ ఎక్కడ పోటీ చేసినా.. అక్కడ ఓట్ చోరీ పక్కా..