E-Paper
Advertisement

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు
Advertisement

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో ముఖ్యంగా కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై లోతైన చర్చ జరిగింది. సమావేశంలో పాల్గొన్న మంత్రులపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహంగా ఉన్నట్టు. వారికి కొన్ని కఠినమైన హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.

సమావేశంలో ప్రధానంగా కూటమి ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా.. సీఎం చంద్రబాబు నాయుడు ఇన్‌ఛార్జ్ మంత్రులకు కీలకమైన బాధ్యతలను అప్పగించారు. ఏ ఎమ్మెల్యే అయినా తప్పు చేస్తే, వారిని సరిదిద్దే పూర్తి బాధ్యత ఇన్‌ఛార్జ్ మంత్రులదేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని మంత్రులను సీఎం ఆదేశించారు.

Advertisement

ఈ ముఖ్యమైన అంశాన్ని మొదట డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేవనెత్తినట్లు సమాచారం. కూటమి ఎమ్మెల్యేల్లో ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా లేదా నిర్దేశించిన పనితీరును పాటించకపోయినా.. వారిపై ఇన్‌ఛార్జ్ మంత్రులు కఠినంగా వ్యవహరించాలని.. తదనుగుణంగా ఆదేశాలు జారీ చేయాలని ఆయన సీఎం చంద్రబాబును కోరారు.

పవన్ కల్యాణ్ చేసిన సూచనపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కూటమి ఎమ్మెల్యేల బాధ్యతలను మంత్రులే పూర్తిగా తీసుకుంటారని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ విషయంపై రాబోయే కేబినెట్ సమావేశంలో సమగ్ర సమీక్ష నిర్వహించి, తదుపరి చర్యలను నిర్ధారిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేల పనితీరులో లోపాలుంటే సహించేది లేదన్న సంకేతాలను ఈ సమావేశం ద్వారా సీఎం స్పష్టంగా పంపారు.

Advertisement

ఈ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చ జరిగినప్పటికీ, అధిక దృష్టి ఎమ్మెల్యేల క్రమశిక్షణ, వారి పనితీరు మెరుగుదలపైనే కేంద్రీకృతమైనట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇన్‌ఛార్జ్ మంత్రులు తమ తమ జిల్లాల్లోని ఎమ్మెల్యేలపై మరింత పర్యవేక్షణ పెంచే అవకాశం ఉంది.

కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలందరూ వారి వారి నియోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, కనీస క్రమశిక్షణ పాటించాలని ఈ సమావేశం గట్టి సందేశాన్ని పంపింది. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం మంత్రులకు ఇవ్వడం ద్వారా.. పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు.. నేటి టాప్ 20 న్యూస్ ఇవే!

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×