BigTV English

AP Assembly : బడ్జెట్ ప్రసంగ సమయంలో నిరసన.. టీడీపీ సభ్యులు సస్పెండ్..

AP Assembly : బడ్జెట్ ప్రసంగ సమయంలో నిరసన.. టీడీపీ సభ్యులు సస్పెండ్..

AP Assembly : ఏపీ అసెంబ్లీలో మరోసారి గందరగోళం రేగింది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. దీంతో టీడీపీ సభ్యులపై మరోసారి వేటు పడింది. 14 మందిని స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు సస్పెండ్ చేశారు. బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారని ఈ చర్యలు తీసుకున్నారు.


ఏపీ అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టగానే టీడీపీ సభ్యులు ఆందోళన మొదలుపెట్టారు. బడ్జెట్ ప్రసంగానికి పదే పదే అడ్డుతగిలారు. దీంతో బుగ్గన కాసేపు బడ్జెట్ ప్రసంగాన్ని ఆపేశారు. ఈ సమయంలో సీఎం వైఎస్ జగన్ తన సీటు నుంచి లేచి మాట్లాడారు. బడ్జెట్‌ ప్రసంగాన్ని రాష్ట ప్రజలు చూస్తున్నారని టీడీపీ సభ్యులకు గట్టిగా చెప్పారు. బడ్జెట్‌ ప్రసంగానికి టీడీపీ అడ్డుపడటం సరికాదని హితవు పలికారు.

టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ తమ్మనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ను అడ్డుకోవడం సరికాదని హెచ్చరించారు. ఇష్టం లేకుంటే సభ నుంచి వాకౌట్‌ చేయాలని స్పీకర్‌ సూచించారు. అయినా సరే బడ్జెట్‌ ప్రసంగానికి పదేపదే అడ్డు తగలడంతో ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్‌ సస్పెండ్ చేశారు.


బుధవారం కూడా 12 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. వారితోపాటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వేటు వేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును ఈ అసెంబ్లీ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు స్పీకర్. అయినాసరే సభలో మరోసారి అదే సీన్ రిపీట్ అయ్యింది.

ICC: అశ్విన్‌ టాప్.. కోహ్లీ బెటర్.. ఐసీసీ ర్యాంకుల్లో మనోళ్ల హవా..

Pawan Kalyan: జనసేనానికి జగన్ భయపడ్డారా? ‘వారాహి’ యాత్ర, సభ సక్సెస్ అందుకేనా?

Related News

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Big Stories

×