BigTV English
Advertisement

AP Assembly : బడ్జెట్ ప్రసంగ సమయంలో నిరసన.. టీడీపీ సభ్యులు సస్పెండ్..

AP Assembly : బడ్జెట్ ప్రసంగ సమయంలో నిరసన.. టీడీపీ సభ్యులు సస్పెండ్..

AP Assembly : ఏపీ అసెంబ్లీలో మరోసారి గందరగోళం రేగింది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. దీంతో టీడీపీ సభ్యులపై మరోసారి వేటు పడింది. 14 మందిని స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు సస్పెండ్ చేశారు. బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారని ఈ చర్యలు తీసుకున్నారు.


ఏపీ అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టగానే టీడీపీ సభ్యులు ఆందోళన మొదలుపెట్టారు. బడ్జెట్ ప్రసంగానికి పదే పదే అడ్డుతగిలారు. దీంతో బుగ్గన కాసేపు బడ్జెట్ ప్రసంగాన్ని ఆపేశారు. ఈ సమయంలో సీఎం వైఎస్ జగన్ తన సీటు నుంచి లేచి మాట్లాడారు. బడ్జెట్‌ ప్రసంగాన్ని రాష్ట ప్రజలు చూస్తున్నారని టీడీపీ సభ్యులకు గట్టిగా చెప్పారు. బడ్జెట్‌ ప్రసంగానికి టీడీపీ అడ్డుపడటం సరికాదని హితవు పలికారు.

టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ తమ్మనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ను అడ్డుకోవడం సరికాదని హెచ్చరించారు. ఇష్టం లేకుంటే సభ నుంచి వాకౌట్‌ చేయాలని స్పీకర్‌ సూచించారు. అయినా సరే బడ్జెట్‌ ప్రసంగానికి పదేపదే అడ్డు తగలడంతో ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్‌ సస్పెండ్ చేశారు.


బుధవారం కూడా 12 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. వారితోపాటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వేటు వేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును ఈ అసెంబ్లీ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు స్పీకర్. అయినాసరే సభలో మరోసారి అదే సీన్ రిపీట్ అయ్యింది.

ICC: అశ్విన్‌ టాప్.. కోహ్లీ బెటర్.. ఐసీసీ ర్యాంకుల్లో మనోళ్ల హవా..

Pawan Kalyan: జనసేనానికి జగన్ భయపడ్డారా? ‘వారాహి’ యాత్ర, సభ సక్సెస్ అందుకేనా?

Related News

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Big Stories

×