E-Paper
Advertisement

Kadapa News: సీఎం ఇలాకాలో పట్టపగలే దారుణ హత్య.. వైసీపీ కార్యకర్త నరికివేత..

Kadapa News: సీఎం ఇలాకాలో పట్టపగలే దారుణ హత్య.. వైసీపీ కార్యకర్త నరికివేత..
Advertisement

Kadapa news today(Local news Andhra Pradesh) : సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలో దారుణం జరిగింది. కడపలో పట్టపగలే కక్షలు కత్తులు దూశాయి. ఇద్దరు దుండగులు బుర్ఖా ధరించి కత్తులతో తెగబడ్డారు. వైసీపీ కార్యకర్త శ్రీనివాసులరెడ్డిని దారుణంగా పొడిచి చంపేశారు. భూతగాదాలే శ్రీనివాసులరెడ్డి హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యచేసిన నింతుల కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాసులు రెడ్డి కడపలో ఉంటారు. ఆయనకు కొంతమందితో భూతగాదాలు ఉన్నాయి. శ్రీనివాసులరెడ్డి జిమ్‌ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు మాటు వేశారు. బుర్ఖా ధరించి వచ్చి విచక్షణా రహితంగా కత్తులతో పొడిచారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు.

ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లిఖార్జున్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Tags

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×