E-Paper
Advertisement

Kadapa News: సీఎం ఇలాకాలో పట్టపగలే దారుణ హత్య.. వైసీపీ కార్యకర్త నరికివేత..

Kadapa News: సీఎం ఇలాకాలో పట్టపగలే దారుణ హత్య.. వైసీపీ కార్యకర్త నరికివేత..

Kadapa news today(Local news Andhra Pradesh) : సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలో దారుణం జరిగింది. కడపలో పట్టపగలే కక్షలు కత్తులు దూశాయి. ఇద్దరు దుండగులు బుర్ఖా ధరించి కత్తులతో తెగబడ్డారు. వైసీపీ కార్యకర్త శ్రీనివాసులరెడ్డిని దారుణంగా పొడిచి చంపేశారు. భూతగాదాలే శ్రీనివాసులరెడ్డి హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యచేసిన నింతుల కోసం గాలింపు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాసులు రెడ్డి కడపలో ఉంటారు. ఆయనకు కొంతమందితో భూతగాదాలు ఉన్నాయి. శ్రీనివాసులరెడ్డి జిమ్‌ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు మాటు వేశారు. బుర్ఖా ధరించి వచ్చి విచక్షణా రహితంగా కత్తులతో పొడిచారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు.

ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లిఖార్జున్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Tags

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×