E-Paper
Advertisement

YCP Third List : వైసీపీ మూడో జాబితా విడుదల.. విజయవాడ ఎంపీ టికెట్ ఎవరికంటే..?

YCP Third List : వైసీపీ మూడో జాబితా విడుదల.. విజయవాడ ఎంపీ టికెట్ ఎవరికంటే..?

YCP Third List : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మూడో జాబితా వచ్చింది. 21 మందితో వైసీపీ మూడో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జులను నియమించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాజాగా వైసీపీ ఇంఛార్జుల మూడో జాబితాను విడుదల చేశారు. మూడో జాబితాను నిన్ననే ప్రకటించాల్సి ఉండగా.. కొందరి విషయంలో స్పష్టత రాకపోవటంతో ఈరోజుకు వాయిదా పడింది.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో.. సీఎం జగన్‌తో భేటీ అయిన మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సుదీర్ఘంగా చర్చించి.. జాబితాను ఫైనల్ చేశారు. ఈ జాబితాలో 21 నియోజకవర్గాలకు సంబంధించి కొత్త ఇంఛార్జులను ప్రకటించారు. పార్లమెంట్ పరిధిలోనూ పలువురికి ఇంఛార్జులుగా అవకాశం కల్పించారు వైఎస్ జగన్.

తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కోణేటి ఆదిమూలం, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం, ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయ, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్, విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ,ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్‌లను ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం.

రాయదుర్గం అసెంబ్లీ అభ్యర్థిగా మెట్టు గోవింద రెడ్డి, దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు నుంచి మూతిరేవుల సునీల్ కుమార్, చిత్తూరు నుంచి విజయానంద రెడ్డి, మదనపల్లె నుంచి నిస్సార్ అహ్మద్, రాజంపేట నుంచి ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, ఆలూరు నుంచి బూసినే విరూపాక్షి, కోడుమూరు నుంచి డా. సతీష్, గూడూరు నుంచి మేరిగ మురళి, సత్యవేడు నుంచి మద్దిల గురుమూర్తి, పెనమలూరు నుంచి జోగి రమేష్, పెడన నుంచి ఉప్పాల రామును బరిలోకి దించనుంది వైసీపీ అధిష్టానం. జోగి రమేష్‌ను పెడన నుంచి పెనమలూరుకు మార్పు చేసింది. తిరుపతి ఎంపీ స్థానం నుంచి సత్యవేడుకు గురుమూర్తిని కూడా మార్పు చేసింది. ఇక వైసీపీ కండువా కప్పుకోకున్నా కేశినేని నానికి విజయవాడ ఎంపీ టికెట్ కేటాయించింది వైసీపీ అధిష్టానం.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×