E-Paper
Advertisement

Mahatma : విశేషాల సమాహారం.. మన బాపూ జీవితం

Mahatma : విశేషాల సమాహారం.. మన బాపూ జీవితం
Advertisement
Mahatma

Mahatma : గాంధీజీది ఎడమచేతి వాటం. గాంధీజీ బాల్యంలో ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవారు కాదు. ఎవరైనా పలకరిస్తారేమోనని బడి వదలేయగానే పలక తీసుకుని ఎక్కడా ఆగకుండా ఇంటికి పరిగెత్తేవాడు.

గాంధీజీ 13వ ఏటే ఆయన వివాహం జరిగింది. కస్తూర్బా ఆయన కంటే ఒక ఏడాది పెద్దవారు. బాపూజీ 16వ ఏటనే తండ్రి అయ్యారు గానీ.. ఆ శిశువు రోజులకే చనిపోయింది.

Advertisement

గాంధీ ఇంగ్లాండ్‌లో ‘లా’ విద్యార్థిగా ఉండగా ‘ నీ చేతిరాత కనీసం నీకైనా అర్థమవుతుందా’ అంటూ పలుమార్లు అధ్యాపకుల చీవాట్లు తిన్నారు.

లండన్‌లో ఉండగా డబ్బు ఆదా చేసేందుకు బస్సులున్నప్పటికీ.. ఐదేసి మైళ్లు నడిచే పోయేవారు.

Advertisement

గాంధీజీకి ఫుట్‌బాల్ అంటే పిచ్చి. జోహన్స్‌‌బర్గ్‌ , ప్రిటోరియాలో ఆయన రెండు ఫుట్‌బాల్ క్లబ్‌లు ఏర్పాటుచేశారు.

1921లో తన మధురై పర్యటనలో చిరుగుల గోచీలు ధరించిన నిరుపేదలను చూశాక.. గాంధీజీ కొల్లాయిని కట్టటం మొదలుపెట్టారు.

ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే విదేశీయుడు భగవద్గీత గొప్పదనం గురించి చెప్పేవరకు బాపూజీ దానిని చదవలేదు. నాటినుంచి అది ఆయనకు నిత్యపారాయణ గ్రంథం అయింది.

టైమ్ మ్యాగజైన్ 1930లో ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా బాపూజీ జీవితంపై కవర్ స్టోరీ ఇచ్చింది.

శాకాహారంపై ‘ది మోరల్ బేసిస్ ఆఫ్ వెజిటేరియనిజం’ అనే పుస్తకాన్ని బాపూజీ రచించారు. ఒక దశలో పాలు కూడా వద్దనుకున్నా.. వైద్యుల సలహాతో మేకపాలకు పరిమితమయ్యారు.

గాంధీ నిరాహార దీక్షలో ఉండగా, బ్రిటిషర్లు ఎవరినీ ఫోటోలు తీయనిచ్చేవారు కాదు. అవి బయటికి పోతే.. జనం తిరగబడతారని అధికారులు గడగడలాడేవారు.

భారతదేశంలోనే గాక 48 బయటి దేశాల నగరాల్లోని పలు రోడ్లకు మహాత్ముడి పేరు పెట్టారు.

గాంధీజీ పేరు 1937 నుంచి అయిదుసార్లు నోబెల్ శాంతి పురస్కరానికి షార్ట్ లిస్ట్ అయింది. 1948లోనైనా ఆయనను ఆ గౌరవం వరిస్తుందని అందరూ భావించారు. కానీ.. అంతలోనే ఆయన హత్యకు గురయ్యారు.

మహాత్ముడి అంతిమయాత్రకు ఏకంగా 20 లక్షల జనం స్వచ్ఛందంగా కదిలివచ్చారు. సుమారు 8 కి.మీ. మేర బారులు తీరి ఆయనకు చివరిసారి నివాళులర్పించారు.

తన జీవిత కాలంలో బాపూజీ 50 వేల పేజీలకు పైగానే రచనలు చేశారు.

1959లో తమిళనాడు మధురైలో గాంధీ మ్యూజియాన్ని ఏర్పాటుచేశారు. అందులో హత్యకు గురైన సమయంలో బాపూజీ ధరించిన దుస్తులున్నాయి.

ఆయన జీవితాంతం ఏ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారో, ఆయన చనిపోయిన 21 ఏళ్లకు.. అదే ప్రభుత్వం ఆయన పేరున ఒక స్టాంపును విడుదలచేసింది.

Related News

ఫిఫా ఫైనల్ కురుక్షేత్రం.. 16 ఏళ్ల కల నెరవేరిన వేళ.. కన్నీళ్లతో మెస్సీ వీడ్కోలు!

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

Big Stories

Advertisement
×