E-Paper
Advertisement

Uma Maheswari : హరికథకు వైభవం తెచ్చిన ఉమామహేశ్వరి..!

Uma Maheswari : హరికథకు వైభవం తెచ్చిన ఉమామహేశ్వరి..!
Uma Maheswari

Uma Maheswari : ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ నుంచి పద్మశ్రీ అవార్డును పొందిన ఏకైక వ్యక్తిగా ఉమామహేశ్వరి నిలిచారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టినా, తండ్రి లాలాజీరావు వేములవాడ రాజరాజేశ్వరిస్వామి దేవస్థానంలో ఆస్థాన నాదస్వర విద్వాంసుడిగా పనిచేయటంలో అక్కడే పెరిగారు. బాల్యం నుంచే ఆమెకు సంగీతంపై ఆసక్తి ఏర్పడటం, సెలవులకు మచిలీపట్నం వచ్చినప్పుడు హరికథలను విని ఆసక్తిని పెంచుకున్నారు. తండ్రి సూచనతో తానూ హరికథా కళాకారిణి కావాలని బలంగా నిర్ణయించుకున్నారు.

అనంతరం 14 ఏళ్ల వయసులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో ఉన్న శ్రీ సర్వారాయ హరికథా గురుకులంలో చేరి వడ్లమాని నర్సింహదాసు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షితులు, కృష్ణమాచార్యులు, లక్ష్మీపతిరావు, విశ్వనాథ భాగవతులు లాంటి ప్రముఖ గురువుల వద్ద శిక్షణ పొందారు. విజయనగరం సంస్కృత కళాశాలలో ‘రుక్మిణి కల్యాణం హరికథా గానం’ తొలి ప్రదర్శనను ఇచ్చారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు.

ఇప్పటిదాకా వేల ప్రదర్శనలు ఇచ్చారు. దేశంలోని విశ్వవిద్యాలయాలన్నీ ఆమె ప్రదర్శనల్ని ఏర్పాటు చేశాయి. తెలుగుతోపాటు సంస్కృతంలోనూ హరికథా గానం చేశారు. సంగీత నాటక అకాడమీ అవార్డును కూడా అందుకున్నారు. ఉమామహేశ్వరి భర్త కళాకృష్ణ ఆంధ్ర నాట్యంలో నిష్ణాతులు. వీరు అఖిల, సాయిమణిదీప్‌ అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచి పెద్దచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ బేగంపేటలో కుటుంబంతో కలిసి ఉమామహేశ్వరి నివసిస్తున్నారు.

అంచెలంచెలుగా ఎదిగి.. జాతీయస్థాయి కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ కళకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకొచ్చి.. దేశవిదేశాల్లో ఎన్నో అవార్డుల్ని అందుకున్నారు. తాజాగా ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×