Cooking Oil Rates: ఇరాన్-ఇజ్రాయెల్, యూఎస్ యుద్ధం ఎఫెక్ట్ భారత్ పై పడుతుంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధరలు పెరగగా.. తాజాగా వంట నూనె ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. యుద్ధ ప్రభావంతో ప్రపంచ సరుకు రవాణా వ్యవస్థలో అంతరాయం ఏర్పడింది. దీంతో భారత్కు దిగుమతి అయ్యే వంట నూనెల ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
సన్ఫ్లవర్ ఆయిల్ ధర లీటర్ కు రూ.150-రూ.170 పెరిగింది. ఒక్క వారంలోనే రూ.20 పెరుగుదల నమోదు చేసింది. పామాయిల్ లీటర్కు రూ.15–రూ.20 వరకు పెరిగింది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనతో వినియోగదారులు ముందుగానే నూనె కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.
దేశంలోని అనేక ప్రాంతాలలో వంట నూనె ధరలు పెరిగాయి. దీంతో గృహ బడ్జెట్లపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, సరుకు రవాణా అంతరాయాలు, ముడి చమురు ధరలు పెరుగుదలతో ఇంటి బడ్జెట్ ఇబ్బందిగా మారింది. ఇటీవల సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, పామాయిల్ ధరలు హోల్సేల్ మార్కెట్లలో దాదాపు 5 శాతం పెరిగాయి. అనేక నగరాల్లో, రిటైల్ ధరలు లీటర్ కు రూ.3 నుంచి రూ.20 వరకు పెరిగాయి.
వంట నూనెల ధరలు పెరుగుదలకు ప్రధాన కారణం ప్రపంచ ముడి చమురు ధరల పెరుగుదల అని నిపుణులు అంటున్నారు. ముడి చమురు రవాణాకు ఆటంకం, షిప్పింగ్ ఖర్చులు పెరగడంతో వంట నూనె ధరలపై ప్రభావం పడింది. భారతదేశం వంట నూనె అవసరాలలో ఎక్కువ భాగం ఇండోనేషియా, మలేషియా, రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.
Also Read: 21 రోజుల తర్వాతే గ్యాస్ బుకింగ్.. కొత్త రూల్స్ ఇవే
మిడిల్ ఈస్ట్ లో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో సరకు రవాణా సప్లై చైన్ దెబ్బతింది. ఫలితంగా, అనేక మార్కెట్లలో టోకు వంట నూనె ధరలు పెరిగాయి. ఈ ప్రభావం రిటైల్ కస్టమర్లపై పడింది. ముడి చమురు ధరలు పెరగడం వల్ల బయోడీజిల్ ఉత్పత్తికి వెజిటెబుల్ ఆయిల్ ను ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది వంట నూనెల లభ్యతను తగ్గిస్తుంది, తద్వారా ధరలపై మరింత ఒత్తిడిని పెరుగుతుంది. రాబోయే వారాల్లో వంట నూనెల ధరలు మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.