E-Paper
Advertisement

Gold Rate Increased: కొత్త ఏడాదిలో పరుగులు పెడుతున్న పసిడి.. నేడు తులం ఎంతంటే?

Gold Rate Increased: కొత్త ఏడాదిలో పరుగులు పెడుతున్న పసిడి.. నేడు తులం ఎంతంటే?

Gold Rate Increased: నిన్నమొన్నటి వరకు కాస్తంత తగ్గు ముఖం పట్టిన బంగారం ధరలు, నేడు మళ్లీ పై పైకి వస్తున్నాయి. మొన్నటి వరకు “అబ్బా.. తగ్గుతుంది కదా” అని సంబురపడ్డ వారికి నేటి ధరలు చూస్తే గజగజ వణుకు పుడుతుంది.

నేటీ పసిడి ధరలు ఇలా..

నేడు బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగిపోయాయి. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,060 కాగా.. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,200 వద్ద ఉంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,800 ఉండగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,850 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ. 1,140 పెరిగింది.

బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి..?

ఈ ధరలు ఎందుకు ఇలా ఆకాశానికి ఎక్కుతున్నాయంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న గందరగోళమే అసలు కారణం. డాలర్ విలువ పెరగడం, అటు అమెరికాలో వడ్డీ రేట్ల మీద జరుగుతున్న చర్చలు మన ఇక్కడి ధరల మీద బాగా కొడుతున్నయి. దీనికి తోడు మన దగ్గర పెళ్లిళ్ల సీజన్ కూడా వస్తుండటంతో గిరాకీ పెరిగిపోయి, రేట్లు ఇలా చుక్కలు చూపిస్తున్నాయి. మధ్యలో ఒక రెండు రోజులు తగ్గినట్టు అనిపించినా, మళ్లీ ఇట్ల పెరగడం చూస్తుంటే “బంగారం కొనే తరుణం మించిపోయిందా?” అని సామాన్యులు బుర్రలు పాడు చేసుకుంటున్నరు.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..

హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,36,200 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,850 వద్ద పలుకుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..

వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,200 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,850 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,200 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,850 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..

ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,350 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,25,000 వద్ద కొనసాగుతోంది.

Also Read: ఏపీలో మరో ట్రావెల్ బస్సు బోల్తా.. స్పాట్‌లో ఆరుగురు!

నేటి సిల్వర్ ధరలు ఇలా..

నేడు సిల్వర్ ధరలు కూడా భారీగానే పెరిగాయి. గత నాలుగు రోజులుగా తగ్గిన వెండి ధరలు మళ్లీ నేడు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 2,56,000 కాగా.. నేడు శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,60,000 వద్ద కొనసాగుతోంది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,42,000 వద్ద పలుకుతోంది.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×