E-Paper
Advertisement

IRCTC: రైల్వే ఫుడ్ లో జెర్రి.. అధికారుల తీరుపై నెటిజన్ల ఆగ్రహం

IRCTC: రైల్వే ఫుడ్ లో జెర్రి.. అధికారుల తీరుపై నెటిజన్ల ఆగ్రహం
Advertisement

Indian Railways Food: భారతీయ రైల్వే వ్యవస్థకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్నా, క్షేత్రస్థాయి సిబ్బంది చేసే పొరపాట్ల కారణంగా తరచుగా తీవ్ర విమర్శలకు గురవుతుంది. రీసెంట్ గా రైళ్లలో ప్రయాణీకులకు ఇచ్చే దుప్పట్లు, బెడ్ షీట్లు నెలకు ఓసారి ఉతుకుతామని చెప్పి షాకివ్వగా, తాజాగా ఫుడ్ ఏకంగా జెర్రి రావడంతో ప్రయాణీకులు షాక్ అయ్యారు. రైల్వే అధికారుల తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రైల్వే ఫుడ్ లో జెర్రి

Advertisement

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రైళ్లలో అందించే ఫుడ్ కు సంబంధించిన పరిశుభ్రత మీద ప్రయాణీకులలో ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి. ఫుడ్ విషయంలో సరైన ప్రమాణాలు పాటించరనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఫుడ్ లో జెర్రి రావడం ఆ అనుమానాలకు బలం చేకూర్చింది.  అదీ IRCTC VIP ఎగ్జిక్యూటివ్ లాంజ్‌ లో ఆర్డర్ చేసిన ‘రైతా’లో వచ్చినట్లు ఓ వ్యక్తి వెల్లడించాడు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రైల్వే ఫుడ్ లో జెర్రి వచ్చినట్లు వెల్లడించాడు. ఈ పిక్ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఇలాంటి ఫుడ్ పెట్టి ప్రయాణీకులను చంపాలని చూస్తున్నారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇండియన్ రైల్వే పోస్టుకు కౌంటర్

Advertisement

గత కొద్ది రోజుల క్రితం ఇండియన్ రైల్వేస్ ట్విట్టర్ వేదికగా ఫుడ్ గురించి ఓ ఫోటో షేర్ చేసింది. భారతీయ రైల్వేలలో ప్రయాణీకులకు అందించే ఫుడ్ నాణ్యత పెరిగిందని వెల్లడించింది. “గత కొద్ది సంవత్సరాలతో పోల్చితే, భారతీయ రైల్వే ఆహార నాణ్యత కాస్త మెరుగుపడింది” అంటూ ప్రయాణీకుల కోసం ఫుడ్ తయారు చేసే కిచెన్ ఫోటో షేర్ చేసింది. ఈ పోస్టుకు ‘aaraynsh’ అనే వ్యక్తి కౌంటర్ గా  ఫుడ్ లో జెర్రి ఉన్న ఫోటోను ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టాడు. “అవును,  కచ్చితంగా భారతీయ రైల్వే ఆహార నాణ్యత మెరుగుపడింది. ఇప్పుడు రైతాను మరింత ప్రొటీన్ తో అందిస్తున్నారు” అంటూ కామెంట్ పెట్టాడు. “ఈ ఫుడ్ అందించింది  IRCTC VIP ఎగ్జిక్యూటివ్ లాంజ్‌ లో.సాధారణ రైళ్లు, ప్యాంట్రీ కార్లలో ఫుడ్ క్వాలిటీ ఏ లెవల్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మూడు రోజుల క్రితం షేర్ చేసిన ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

నెటిజన్లు ఏం అంటున్నారంటే?

రైతాలో జెర్రి ఉన్న ఫోటోను చూసి నెటిజన్లు భారతీయ రైల్వే సంస్థపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. “అందుకే టిక్కెట్లు బుకింగ్ చేసేటప్పుడు నేను రైలు ఆహారాన్ని ఎప్పుడూ తీసుకోను” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో వీలైనంత వరకు ఫుడ్ ను తీసుకోకపోవడం మంచిది” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “డబ్బులు తీసుకుని ఇలాంటి చెత్త ఫుడ్ సరఫరా చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని మరికొంత మంది డిమాండ్ చేస్తున్నారు.

Read Also: రైల్లో బ్లాంకెట్స్ కప్పుకుంటున్నారా? జాగ్రత్త, ఓ షాకింగ్ విషయం బయటపడింది!

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×