BigTV English
Advertisement

Odisha CM PA Died: విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒడిశా సీఎం పీఏ మృతి!

Odisha CM PA Died: విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒడిశా సీఎం పీఏ మృతి!

Odisha CM PA Died in Road Accident: ఒడిశా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా మంగళవారం మోహన్ చరణ్ మాఝి ఎంపికయ్యారు. బుధవారం సాయంత్రం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు పలువురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ హాజరయ్యారు.


ఇదిలా ఉంటే, మోహన్ చరణ్ మాఝి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందాడు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్ లోని సిరపూర్ లో చందన్ కుమార్ (31) మంగళవారం బైక్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన కారు అతడి వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యలోనే చందన్ కుమార్ మరణించినట్లు ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.

Also Read: భారత్‌లోని పేదలు, వయానడ్ ప్రజలు.. వీరే నా దేవుళ్లు: రాహుల్ గాంధీ


వేగంగా వచ్చిన ఆ కారు.. మృతుడినే కాదు, మరో ఇద్దరు వాహనదారులను, కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. తన పీఏ మృతి గురించి తెలుసుకున్న మోహన్ చరణ్ మాఝి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Tags

Related News

Road Accident: పెళ్లి కారు టైరు పేలి‌.. ముగ్గురు స్పాట్‌డెడ్‌

Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. మంటల్లో తగలబడి.. 8 మంది స్పాట్!

Patancheru Tollgate: ఘోర రోడ్డు ప్రమాదం.. పటాన్‌చెరులో ట్యాంకర్‌ బోల్తా..

Hyderabad News: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..?

TMC MP Kalyan Banerjee: సైబర్ వలకు చిక్కిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ₹55 లక్షల స్వాహా!

Tamil Nadu: చిన్నారి ప్రాణం తీసిన తల్లి.. మరో మహిళతో అఫైర్‌!

Nellore Accident: నెల్లూరులో స్కార్పియో యాక్సిడెంట్.. నలుగురు టీచర్లు స్పాట్!

Rajendranagar Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం వాహనం..

Big Stories

×