E-Paper

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!
Advertisement

Ghatkesar: ఘట్‌కేసర్ పరిధిలో గురువారం రాత్రి ఒక కలచివేసే విషాదం చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వలస వచ్చిన ఓ యువ దంపతులు రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ ఘాతుకానికి ఒడిగట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, కలకలాన్ని రేపింది.

గ్రామం వదిలి నగరానికి..

Advertisement

మహబూబాబాద్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపాయిపేట గ్రామానికి చెందిన రవికుమార్ (32), శిరీష (26) భార్యాభర్తలు. సొంత ఊరిలో సరైన ఉపాధి లేకపోవడంతో, జీవితాన్ని నిలబెట్టుకోవాలనే ఆశతో వారు కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నగరానికి వలస వచ్చారు. ప్రస్తుతం హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. నగరంలో ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

రైల్వే ట్రాక్‌పై ఘోరం

Advertisement

అయితే, గురువారం రాత్రి ఘట్‌కేసర్ – బీబీనగర్ రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న ఎన్ఎఫ్‌సీ (NFC) సమీపంలో ఈ దంపతులిద్దరూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. చీకట్లో వేగంగా దూసుకొచ్చిన రైలు కింద పడటంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

Also Read: మేము చెప్పిన లెక్కలకే కట్టుబడి ఉన్నాం.. మంత్రి జూపల్లికి హరీష్ రావు బహిరంగ లేఖ!

ఆర్థిక ఇబ్బందులే కారణమా?

మృతుడు రవికుమార్ గత కొంతకాలంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. నగరంలో అనుకున్న స్థాయిలో సంపాదన లేకపోవడం, అప్పుల భారం పెరిగిపోవడంతో మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెంది భార్యతో కలిసి ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడా? లేక వీరి ఆత్మహత్య వెనుక మరేదైనా కుటుంబ కలహాలు, ఇతర బలమైన కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

Related News

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

పిల్లలను వాషింగ్ మెషిన్ లోపల పెట్టి.. బెంగళూరు డే-కేర్ సెంటర్‌లో దారుణాలు, ఐదుగురు అరెస్ట్?

హనుమకొండలో విషాదం.. పెళ్లింట్లో విద్యుత్ షాక్ తో తండ్రి, కొడుకు మృతి

Big Stories

×