Big Stories

NTR: బాలీవుడ్ లో బాగా గట్టిగా ప్లాన్ చేస్తున్నావ్ తారక్..

NTR: ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్.. బాలీవుడ్ వైపు కన్నేశాడు. టాలీవుడ్ లో ఇప్పటివరకు తన నటనతో సత్తా చాటిన తారక్.. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో పాగా వేయడానికి చాలానే కష్టపడుతున్నాడు. ఇప్పటికే వార్ 2 లో ఎన్టీఆర్ ఒక హీరోగా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్.. నిత్యం ముంబైకు వెళ్లి వస్తున్నాడు. అంతేకాకుండా బాలీవుడ్ బిగ్గిస్ తో తారక్ దగ్గరవుతున్నాడు. వారి కుటుంబాలతో కలిసి డిన్నర్స్ కూడా వెళ్తున్నాడు.

- Advertisement -

తాజాగా తారక్.. బాలీవుడ్ బిగ్గిస్ తో కలిసి డిన్నర్ కు వెళ్లడం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రణబీర్- అలియా, హృతిక్ రోషన్- సభా .. కరణ్ జోహార్ లతో కలిసి ఎన్టీఆర్ దంపతులు గతరాత్రి ముంబైలోని ఒక రెస్టారెంట్ లో డిన్నర్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. తారక్.. వార్ 2 లోనే కాకుండా మరో హిట్ సినిమా సీక్వెల్ లో కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బ్రహ్మాస్త్ర 2 లో కూడా తారక్ నటిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -

ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ క్రేజ్ బాలీవుడ్ లో పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఆ క్రేజ్ నే తారక్ వాడుకుంటున్నాడు. దేవర సినిమా హక్కులను బాలీవుడ్ లో కరణ్ జోహార్ కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. ఇదంతా చూస్తుంటే.. తారక్.. బాలీవుడ్ లో పాగా వేయడానికి బాగా గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి.. తారక్ ప్లాన్స్ ఎలా వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News