Spirit Movie : స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది కలిగి మూవీతో ప్రేక్షకులను పలకరించాడు ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇప్పుడు మరో నాలుగు సినిమాలను పెట్టుకున్నాడు. ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. ఆ తర్వాత హను రాఘవపూడితో ఫౌజీ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ పూజ కార్యక్రమాలతో షూటింగ్ మొదలైంది. ఆ తర్వాత ప్రభాస్ సందీప్ వంగా తో స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. ఆ మూవీ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ప్రభాస్ ను ఎప్పుడెప్పుడు చూద్దాం అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి అదిరిపోయే న్యూస్ ను షేర్ చేశారు స్పిరిట్ టీమ్.. అదేంటో ఒకసారి చూసేద్దాం..
స్పిరిట్ మూవీ..
పాన్ ఇండియా హీరో ప్రభాస్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ స్టోరీ.. అంచనాలకు తగ్గట్టుగానే.. ఎన్నో ట్విస్టులు, ఇంట్రెస్టింగ్ అంశాలతో రూపొందనుందని సమాచారం.. భారీ బడ్జెట్ తో ఈ మూవీ రాబోతుంది. 2000 కోట్ల టార్గెట్ తో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ లో డైరెక్టర్ ఉన్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పేర్కొన్నాడు.
Also Read :షాకింగ్ నిర్ణయం తీసుకున్న బాలయ్య బ్యూటీ.. అతనితో పెళ్లి..?
స్పిరిట్ మూవీ అప్డేట్..
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగా తో కూడా సినిమా చేస్తున్నాడు. స్పిరిట్ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ మూవీ పై మ్యూజిక్ డైరెక్టర్ హర్ష వర్ధన్ రామేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. డార్లింగ్ అంటే తనకు చాలా అభిమానం అని ఆయన అన్నారు. అందుకే స్పిరిట్ మూవీ కోసం కసిగా పని చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ మూవీకి అదిరిపోయే సంగీతాన్ని అందిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సందీప్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని మ్యూజిక్ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. ఆయనతో చేసింది సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ ను ఇందులో పెట్టబోతున్నారని ఆయన అన్నారు. ఈ మూవీని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది..సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్సింగ్’ చిత్రాలకు షూటింగ్ పూర్తయిన తర్వాత, ‘యానిమల్’ విషయంలో చిత్రీకరణకు ముందే నేపథ్య సంగీతం అందించానని గుర్తుచేసుకున్నారు. ‘యానిమల్’లోని కొన్ని పాటలకూ హర్షవర్ధన్ స్వరాలు సమకూర్చారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ను ప్లాన్ చేసుకుంటున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఈ క్రమంలోనే చాలావరకు సౌత్ స్టార్లు తన డైరెక్షన్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.. గతంలో వచ్చిన యానిమల్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇక స్పిరిట్ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ అవ్వడం పక్కా అని డార్లింగ్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.