BigTV English

Red Sea: భగ్గుమన్న ఎర్రసముద్రం.. రెండు నౌకలపై దాడి

Red Sea: భగ్గుమన్న ఎర్రసముద్రం.. రెండు నౌకలపై దాడి

Red Sea: ఎర్రసముద్రం భగ్గుమంది. హౌతీ తిరుగుబాటు దారులు.. రవాణా నౌకలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. సోమవారం స్వాన్ అట్లాంటిక్ అనే నౌకపై యెమెన్ లోని తమ ఆధీనంలో ఉన్న భూభాగం నుంచి ఒక డ్రోన్, యాంటీషిప్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.


స్వాన్ అట్లాంటిక్ పై దాడి జరిగే సమయంలో మరో బల్క్ కార్గో షిప్ ఎంవి క్లారాకు అత్యంత సమీపంలో భారీ పేలుడు జరిగింది. కాగా.. ఈ రెండు దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు తమకు సమాచారం అందలేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇదిలా ఉండగా.. ఆ నౌకలకు ఇజ్రాయెల్ తో సంబంధం ఉన్న కారణంగానే దాడి చేసినట్లు హౌతీ వర్గాలు వెల్లడించాయి. తమ ఫోన్ కాల్స్ కు నౌక సిబ్బంది స్పందించకపోవడంతో దాడులు చేసినట్లు సమాచారం.

అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్.. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంపై చర్చించేందుకు టెల్ అవీవ్ లో ఉన్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం. దీనిపై ఆస్టిన్ స్పందిస్తూ.. ఎర్రసముద్రంలో నౌకలపై జరుగుతున్న దాడుల గురించి చర్చించేందుకు పశ్చిమాసియాలోని రక్షణ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. నౌకల రక్షణ కోసం ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీనికి ఎర్రసముద్రంలోని కార్యకలాపాలను పర్యవేక్షించే టాస్క్ ఫోర్స్ 153 నాయకత్వం వహిస్తుందని తెలిపారు.


Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×