E-Paper
Advertisement

Eluru : అమాయకులే టార్గెట్.. ఏటీఎం కార్డు మార్చి .. లక్షల కాజేసి.. నయా మోసం..

Eluru :  అమాయకులే టార్గెట్.. ఏటీఎం కార్డు మార్చి ..  లక్షల కాజేసి.. నయా మోసం..
Advertisement

Eluru : ఏటీఎం కార్డు మార్చి నగదు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని లక్క వరం గ్రామానికి చెందిన చందమాల మంగాదేవి అనే మహిళకు స్థానిక యూనియన్ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ నెల 14న తన ఏటీఎం కార్డును భర్త అరుణ్ కుమార్ కు ఇచ్చి నగదు తీసుకురమ్మని చెప్పింది.

జంగారెడ్డిగూడెం పట్టణం బుట్టాయగూడెం రోడ్డులో ఉన్న ఓ ఏటీఎంకు వెళ్లి నగదు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అక్కడ ఉన్న ఓ అపరిచిత వ్యక్తిని సహాయం కోరాడు. అతను ఏటీఎం నుంచి రూ.5 వేలు తీసి ఇచ్చాడు. అరుణ్ కు ఆ వ్యక్తి వేరే ఏటీఎం కార్డు ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పలు దఫాలుగా మంగాదేవి ఖాతా నుంచి రూ.1.86 లక్షలు మాయమయ్యాయి.

Advertisement

ఈ విషయం తెలియని బాధిత కుటుంబం సోమవారం నగదు తీసుకునేందుకు సంబంధిత బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు అధికారులు ఏటీఎం కార్డు మారిందని చెప్పారు. ఖాతాలో సొమ్ము మాయమైనట్లు గుర్తించడంతో అరుణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×