BigTV English

Eluru : అమాయకులే టార్గెట్.. ఏటీఎం కార్డు మార్చి .. లక్షల కాజేసి.. నయా మోసం..

Eluru :  అమాయకులే టార్గెట్.. ఏటీఎం కార్డు మార్చి ..  లక్షల కాజేసి.. నయా మోసం..

Eluru : ఏటీఎం కార్డు మార్చి నగదు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని లక్క వరం గ్రామానికి చెందిన చందమాల మంగాదేవి అనే మహిళకు స్థానిక యూనియన్ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ నెల 14న తన ఏటీఎం కార్డును భర్త అరుణ్ కుమార్ కు ఇచ్చి నగదు తీసుకురమ్మని చెప్పింది.


జంగారెడ్డిగూడెం పట్టణం బుట్టాయగూడెం రోడ్డులో ఉన్న ఓ ఏటీఎంకు వెళ్లి నగదు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అక్కడ ఉన్న ఓ అపరిచిత వ్యక్తిని సహాయం కోరాడు. అతను ఏటీఎం నుంచి రూ.5 వేలు తీసి ఇచ్చాడు. అరుణ్ కు ఆ వ్యక్తి వేరే ఏటీఎం కార్డు ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పలు దఫాలుగా మంగాదేవి ఖాతా నుంచి రూ.1.86 లక్షలు మాయమయ్యాయి.

ఈ విషయం తెలియని బాధిత కుటుంబం సోమవారం నగదు తీసుకునేందుకు సంబంధిత బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు అధికారులు ఏటీఎం కార్డు మారిందని చెప్పారు. ఖాతాలో సొమ్ము మాయమైనట్లు గుర్తించడంతో అరుణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Related News

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Jagan Assembly: ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా? వైసీపీ వ్యూహం ఏంటి?

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు

Vijayawada Durga Festival: 10,000 సీసీ కెమెరాలతో.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు భారీ బందోబస్తు

Big Stories

×