E-Paper
Advertisement

Gyanvapi case : జ్ఞానవాపి కేసు.. ఆ పిటిషన్లు కొట్టేసిన అలహాబాద్‌ హైకోర్టు..

Gyanvapi case : జ్ఞానవాపి కేసు.. ఆ పిటిషన్లు కొట్టేసిన అలహాబాద్‌ హైకోర్టు..
Advertisement

Gyanvapi case : జ్ఞానవాపి కేసుపై అలహాబాద్‌ హైకోర్టు విచారణ చేపట్టింది. మసీదు కమిటీ వేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసు విచారణను 6 నెలల్లో పూర్తి చేయాలని వారణాసి న్యాయస్థానాన్ని ఆదేశించింది.

జ్ఞానవాపి మసీదుపై నలుగురు హిందూ మహిళలు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈ వివాదం మొదలైంది. మొఘల్‌ కాలంలో హిందూ ఆలయ స్థానంలో జ్ఞానవాపి మసీదు నిర్మించారని ఆరోపించారు. ఈ విషయాన్ని సర్వే నిర్వహించి తేల్చాలని న్యాయస్థానాన్ని తమ పిటిషన్లలో కోరారు.

Advertisement

ఆ పిటిషన్లపై వారణాసి కోర్టు విచారణ చేసింది. శాస్త్రీయ సర్వేను మసీదు ప్రాంగణంలో చేయాలని ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీల్‌ చేసిన వజూఖానా ప్రాంతాన్ని సర్వే నుంచి మినహాయింపునిచ్చింది. మసీదు ప్రాంగణం మొత్తం కార్బన్‌ డేటింగ్‌, ఇతర ఆధునిక పద్ధతుల ద్వారా శాస్త్రీయ సర్వే చేపట్టాలని భారత పురావస్తు విభాగాన్ని ఆదేశించింది.

మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని పునరుద్ధరిచాలని దాఖలు చేసిన పిటిషన్లను ఉత్తర్‌ప్రదేశ్‌ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు, అంజుమన్‌ ఇంతెజామియా కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్‌ చేశాయి. అయితే ఈ పిటిషన్లను తాజాగా న్యాయస్థానం కొట్టివేసింది.

Advertisement

మరోవైపు వారణాసిలోని కాశీ విశ్వ‌నాథ్ ఆల‌య స‌మీపంలో ఉన్న జ్ఞాన‌వాపి మ‌సీదుపై చేప‌ట్టిన స‌ర్వే పూర్తి అయ్యింది. పురావాస్తుశాఖ స్టాండింగ్ కౌన్సిల్ అమిత్ శ్రీవాత్స‌వ్‌.. సీల్డ్ క‌వ‌ర్‌లో ఉన్న రిపోర్టును వారణాసి కోర్టు న్యాయమూర్తి ఏకె మిశ్రాకి అందించారు.

జ్ఞానవాపి మసీదును 17వ శతాబ్దంలో నిర్మించడానికి ముందు అక్కడ హిందూ ఆలయం ఉండేదా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఏఎస్ఐ ఈ శాస్త్రీయ సర్వేను నిర్వహించింది. శాస్త్రీయ సర్వేకు వారణాసి జిల్లా కోర్టు అనుమతించడం జిల్లా కోర్టు తీర్పును అలహాబాద్ హైకోర్టు సమర్ధించడంతో హైకోర్టు తీర్పును జ్ఞానవాపి కమిటీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీంకోర్టు సైతం హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో శాస్త్రీయ సర్వే జరిగింది.

Related News

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

Big Stories

Advertisement
×