E-Paper
Advertisement

Manikaran : ఆ పుణ్యక్షేత్రంలో రెండు మతాల దేవుళ్లు

Manikaran : ఆ పుణ్యక్షేత్రంలో రెండు మతాల దేవుళ్లు

రెండు మతాల భక్తులకి ఆ ప్రాంతమంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే అక్కడ రెండు వేర్వేరు మతాలకు దేవుళ్లు కొలువుదీరిన ప్రాంతం. పరమశివుడూ, గురునానక్‌ ఒకే చోట కొలువైన పుణ్యక్షేత్రం మణికరణ్ ‌. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుకి 40 కిలోమీటర్ల దూరంలో ప్రాంతం ఉంది. పార్వతీ లోయ అని పిలిచే ఆ ప్రాంతం బియాస్‌, పార్వతీ నదుల మధ్యలో ఉంటుంది. మణికరణ్ లోని వేర్వేరు ఆలయాల్లో శివుడు, రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి పూజలందుకుంటారు. మరోపక్క గురునానక్‌ కొలువుదీరిన గురుద్వార్‌ ఉంటుంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు సందర్శించే మణికరణ్ లో వేడినీటి బుగ్గలు ఓ అద్భుత సృష్టి. ఎముకలు కొరికే చలిలో సైతం ఆ బుగ్గల్లోని నీళ్లు పొగలు కక్కుతాయి.

బిందెల్లో బియ్యం వేసి ఎసరు పోసి ఆ నీళ్లలో ఉంచితే నిమిషాల్లో అన్నం ఉడుకుతుంది. పప్పు కూడా ఉడికిపోతుంది. అలా వండిన వంటకాలనే గురుద్వార్‌లో నిత్యం గురు నానక్‌కు నైవేద్యంగా పెడతారు. లంగరులో అన్నదానానికీ అలా వండిన అన్నమే ఉపయోగిస్తారు. మరో బుగ్గలో భక్తులు స్నానమాచరిస్తారు. ఆ వేడి నీళ్లల్లో స్నానం చేస్తే చర్మవ్యాధులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు, ఆ వేడి నీటి మర్మం వెనక శివపార్వతుల మహత్యం ఉందని హిందువులు నమ్ముతుంటారు. అదంతా గురునానక్‌ మాయ అని సిక్కులు విశ్వసిస్తారు.అయితే ఆ లోయలో జియోథర్మల్‌ ఎనర్జీ కారణంగా భూమి కింద రాళ్లు వేడెక్కడంతో బుగ్గల్లో నీళ్లు కూడా వేడిగా వస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చేశారు.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×