Big Stories

Koti Dipotsavam : ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం

Koti Dipotsavam : కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు.విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈనెల 7న కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు చేస్తున్నారు.గిరిప్రదక్షిణ దుర్గగుడి టోల్‌గేట్‌ సమీపంలోని ఆలయం నుంచి ప్రారంభమై కుమ్మరిపాలెం, చిట్టినగర్‌, కొత్తపేట, నెహ్రూబొమ్మ సెంటర్‌, బ్రాహ్మణ వీధి మీదుగా మల్లికార్జున మహామండపం వద్దకు చేరుతుందని ఆలయ అధికారులు తెలిపారు.అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, కనకదుర్గానగర్‌, చిన్న రాజగోపురం, పెద్ద రాజగోపురం ప్రాంగణలో భక్తులు దీపాలు వెలిగించేందుకు జోన్‌లుగా విభజించారు.. అదేవిధంగా సాయంత్రం 6.30 గంటలకు సంప్రదాయబద్ధంగా జ్వాలాతోరణం నిర్వహిస్తున్నామని ఈవో తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News