బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

Puri Jagannath Mahaprasad Secrets: ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన, మహిమగల ఆధ్యాత్మిక క్షేత్రాలలో పూరీ జగన్నాథ ఆలయం ఒకటి. ఇక్కడ జరిగే ప్రతి విషయమూ ఒక అద్భుతమే. ముఖ్యంగా స్వామివారికి ప్రతి రోజూ సమర్పించే ‘మహాప్రసాదం’ లేదా ‘ఛప్పన్ భోగ్’ (56 ప్రసాదాలు) వెనక ఉన్న రహస్యాలు వింటే సైంటిస్టులు సైతం ముక్కున వేలేసుకుంటారు. లక్షలాది మంది భక్తులు వచ్చినా ఇక్కడ ప్రసాదం అస్సలు తక్కువ కాదు. అలాగని ఒక్క మెతుకు కూడా వృధా కాదు. మరి ఈ మహాప్రసాదాన్ని ప్రతిరోజూ ఎలా తయారు చేస్తారు? దాని వెనక ఉన్న ఆ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాల:

పూరీ ఆలయంలోని వంటశాల ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. ఇక్కడ సుమారు 600 మంది వంట చేసేవారు, మరో 400 మంది సహాయకులు కలిసి ప్రతి రోజూ స్వామివారికి నైవేద్యాన్ని సిద్ధం చేస్తారు. ఇక్కడ వండే వంట పద్ధతి, వడ్డించే విధానం వెనక పురాణ కాలం నాటి ఆచారాలు ఉన్నాయి.

కుండల మీద కుండలు.. ఆశ్చర్యపరిచే వంట విధానం:
మహాప్రసాదం తయారీలో చూసేవారిని అత్యంత ఆశ్చర్యపరిచే విషయం ఒకటుంది. ఇక్కడ వంటను గ్యాస్ స్టవ్‌లపై చేయరు. కేవలం కట్టెల పొయ్యిల మీదే, మట్టి కుండలలో మాత్రమే వండుతారు.

ఆ మిస్టరీ ఏంటంటే.. ఒకే పొయ్యి మీద ఒకదానిపై ఒకటిగా మొత్తం 7 మట్టి కుండలను నిలువుగా పెడతారు.

సాధారణంగా సైన్స్ ప్రకారం.. అయితే కింద మంటకు దగ్గరగా ఉన్న కుండలోని అన్నం మొదట ఉడకాలి. కానీ.. ఇక్కడ విచిత్రంగా అన్నింటికంటే పైన (ఏడో స్థానంలో) ఉన్న కుండలోని అన్నం మొదట ఉడుకుతుంది. ఆ తర్వాత ఆరో కుండ.. అలా వరుసగా కిందకి వస్తూ చివరగా మంటకు పక్కనే ఉన్న మొదటి కుండలోని అన్నం ఉడుకుతుంది. ఇది జగన్నాథుడి లీల కాక మరేంటని భక్తులు నమ్ముతారు.

56 రకాల ప్రసాదాల రహస్యం:
జగన్నాథుడికి ప్రతి రోజూ 56 రకాల పదార్థాలను నైవేద్యంగా పెడతారు. ఇందులో రకరకాల అన్నాలు, పప్పులు, కూరగాయలు, పిండి వంటలు, తీపి పదార్థాలు ఉంటాయి.

ఈ వంటకాల్లో విదేశీ కూరగాయలైన ఆలుగడ్డలు (బంగాళదుంపలు), టమాటోలు, పచ్చిమిరపకాయలను అస్సలు వాడరు. కేవలం మనదేశపు సాంప్రదాయ నాటు కూరగాయలను మాత్రమే ఉపయోగిస్తారు.

వంట చేసేటప్పుడు ఎలాంటి ఉల్లిపాయ, వెల్లుల్లిని ముట్టుకోరు. కేవలం గంగా యమునా అనే రెండు పవిత్ర బావుల నుంచి తీసిన నీటిని మాత్రమే వంటకు వాడతారు.

Also Read: శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

తక్కువ కాదు.. వృధా కాదు!
పూరీ ఆలయానికి రోజుకు సాధారణంగా 20 వేల మంది నుంచి పండగ రోజుల్లో లక్ష మంది వరకు భక్తులు వస్తుంటారు. కానీ.. ఏ రోజు ఎంతమంది వస్తారో వంటవాళ్లకు తెలియదు. అయినప్పటికీ, ఇక్కడ ప్రసాదం ఎప్పుడూ తక్కువ పడదు. అలాగే ఒక్క రోజు కూడా ప్రసాదం మిగిలిపోయి వృధా అయినట్లు చరిత్రలో లేదు.

ఈ ప్రసాదాన్ని లక్ష్మీదేవి స్వయంగా పర్యవేక్షిస్తుందని, స్వామివారు ఆరగించిన తర్వాతే అది ‘మహా ప్రసాదం’గా మారుతుందని నమ్ముతారు. ఆ ప్రసాదం తింటే ఎలాంటి రోగాలైనా నయమవుతాయని భక్తుల విశ్వాసం.

టెక్నాలజీ ఎంత మారినా.. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా పూరీ జగన్నాథుడి మహా ప్రసాదం తయారీ వెనుక ఉన్న రహస్యాలను ఎవరూ ఛేదించలేకపోయారు.

Related News

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

అక్కడ పై కుండలోని అన్నం ముందెందుకు ఉడుకుతుంది? పూరీ జగన్నాథుడి వంటగది మిస్టరీ!

×